Anupama Parameswaran: ఈ సినిమాతో నాకు రుణం తీరిపోయింది: అనుపమ

  • August 17, 2022 / 05:51 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటిగా ప్రేక్షకులను సందడి చేసిన అనుపమ పరమేశ్వరన్ ఒకానొక సమయంలో అవకాశాలు లేకుండా ఇండస్ట్రీకి దూరమయ్యారు. వరుస సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె నిఖిల్ సరసన నటించిన కార్తికేయ 2 సినిమా విడుదలయ్యి ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి ఆదరణ సంపాదించుకుంది.

ఇకపోతే ఈ సినిమా విడుదలైన మూడు రోజులకే బ్రేక్ ఈవెంట్ సాధించి విజయం సాధించడంతో చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా ఎంతో మంచి విజయాన్ని అందుకొని అందరూ సంతోషంలో ఉండగా ఈమె మాత్రం నాకు చాలా బాధగా ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సినిమా ఇంత మంచి విజయం అందుకోవడంతో ఒకవైపు సంతోషంగా ఉన్నప్పటికీ మరోవైపు చాలా బాధగా ఉందని

అప్పుడే ఈ సినిమాతో నాకు రుణం తీరిపోయిందా అనే బాధ తనని ఎంతగానో కలిచి వేస్తుంది అంటూ ఈ సందర్భంగా ఈమె కార్తికేయ 2 సినిమా గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విధంగా అనుపమ పరమేశ్వరన్ చాలా బాధగా ఉందంటూ చేసిన కామెంట్లపై నేటిజన్స్ స్పందిస్తూ ఇది కాస్త ఓవర్ గా ఉన్నట్టు లేదు అంటూ వారి నోటికి పని చెబుతున్నారు.

మొత్తానికి ఈ ముద్దుగుమ్మ మాట్లాడిన ఈ మాటల వల్ల నెటిజన్ల ట్రోలింగ్ కి గురవుతున్నారని చెప్పాలి.ఇక ఈ సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్ దిల్ రాజు పాల్గొని చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus