మేడ పై యోగా చేస్తున్న కీర్తి సురేష్..వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు

  • December 21, 2022 / 07:30 PM IST

కీర్తి సురేష్.. టాలీవుడ్లో తక్కువ టైంలో స్టార్ స్టేటస్ ను దక్కించుకున్న హీరోయిన్లలో ఒకరు. ‘నేను శైలజ’ ‘నేను లోకల్’ ‘మహానటి’ చిత్రాలతో ఈమె స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తర్వాత పెద్ద సినిమాల్లో నటిస్తూనే మరోపక్క విమెన్ సెంట్రిక్ సినిమాల్లో కూడా నటిస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో కీర్తి సురేష్ హవా తగ్గినట్టు కనిపిస్తుంది. పూజా హెగ్డే, రష్మిక వంటి స్టార్ హీరోయిన్లతో పాటు కృతి శెట్టి, శ్రీలీల వంటి భామలు కూడా ఇప్పుడు స్టార్ హీరోల కంట్లో పడ్డారు.

నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, జాన్వీ కపూర్ వంటి భామలు కూడా టాలీవుడ్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో కీర్తి సురేష్.. కు అవకాశాలు తగ్గుతున్నట్టు కనిపిస్తుంది. ఈ ఏడాది ‘సర్కారు వారి పాట’ వంటి పెద్ద సినిమాలో మాత్రమే కీర్తి సురేష్ కనిపించింది. ప్రస్తుతం ఈమె చేతిలో ‘దసరా’ ‘భోళా శంకర్’ వంటి బడా ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి. 2003 లో ఈ రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

ఇవి హిట్టయితే ఓకే. ప్లాప్ అయితే మాత్రం.. కీర్తి కెరీర్ ప్రమాదంలో పడినట్టే..! అందుకే మెల్ల మెల్లగా ఆమె గ్లామర్ షో పై దృష్టి పెడుతుంది. ఇన్నాళ్లు ఈమె గ్లామర్ షోకి చాలా దూరంగా ఉంటూ వచ్చింది. అయితే ‘సర్కారు వారి పాట’ సినిమాలో చాలా వరకు మోడ్రన్ గా కనిపించి ఆమెలోని కొత్త యాంగిల్ బయటపెట్టింది. ఈ మధ్య కాలంలో తరచూ గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూనే ఉంది. తాజాగా ఆమె మేడ పై యోగా చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు నెటిజన్లకు హీట్ పుట్టించేలా ఉన్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus