Kriti Sanon: అలా చూసినప్పుడే ప్రపంచం అందంగా ఉంటుంది: గీతా సనన్

  • June 22, 2023 / 07:38 PM IST

ప్రభాస్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఆది పురుష్. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ జూన్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా ఈ సినిమా నెగిటివ్ అభిప్రాయాలను ఏర్పరచుకోవడమే కాకుండా తీవ్రస్థాయిలో విమర్శలను కూడా ఎదుర్కొందని చెప్పాలి. అదేవిధంగా సినిమా విడుదలైన తర్వాత ఇందులో హనుమంతుడు, రావణాసురుడు రాముడి పాత్రల గురించి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోని నేపాల్ ప్రేక్షకులు ఈ సినిమాని బ్యాన్ చేయాలి అంటూ కూడా డిమాండ్ చేశారు.

ఈ సినిమాలో సీతాదేవి భారత్ లో పుట్టినట్లు చూపించారు. నిజానికి తను నేపాల్ లో పుట్టిందని ఇలా ఈ సినిమాలో భారత్ లో పుట్టినట్టు చూపించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నేపాల్ ప్రేక్షకులు ఈ సినిమాని బ్యాన్ చేయాలంటూ కోరారు. అయితే ఈ విషయంపై చిత్ర బృందం క్షమాపణలు కూడా కోరిన విషయం మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమాలో సీత పాత్రలో నటి (Kriti Sanon) కృతి సనన్ నటించారు. ఈ సినిమాలో పలువురు పాత్రలపై విమర్శలు వస్తున్నటువంటి తరుణంలో కృతి తల్లి గీత సనన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తన అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ ప్రజలు ఒక నిర్దిష్ట విషయాన్ని మంచి మనస్తత్వం ఆలోచనతో చూడాలనీ తెలియజేశారు.

మనం ఎప్పుడైతే సరైన దృక్పథంతో చూస్తామో ఆ క్షణం ప్రపంచం అందంగా కనపడుతుంది.. భగవంతుడు రాముడు ప్రేమను పంచమని బోధించాడు. శబరి ప్రేమతో రాముడికి పంచిన పళ్ళను చూడాలి కానీ అక్కడ తప్పును చూడకూడదు. ఎప్పుడు కూడా ఎదుటివారి భావోద్వేగాలను అర్థం చేసుకోవాలి జైశ్రీరామ్ అంటూ ఈ సందర్భంగా గీతా సనన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus