Actress : ఆ సినిమాల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్.. ఏమైందంటే?

  • August 2, 2023 / 02:10 PM IST

టాలీవుడ్, కోలీవుడ్, ఇతర ఇండస్ట్రీలలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న హీరోయిన్లలో మాళవిక మోహన్ ఒకరు. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చిన ఈ నటి ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఈ నటి మాతృభాష మలయాళం కాగా పట్టం బోల సినిమాతో ఈ నటి కెరీర్ మొదలైంది. 2013 సంవత్సరంలో ఈ సినిమా థియేటరల్లో విడుదలైంది. పేట సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈ హీరోయిన్ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడాఈ నటికి మంచి పేరు వచ్చింది. మాస్టర్, మారన్ సినిమాలలో నటించడం ఈ నటికి క్రేజ్ పెంచింది. ప్రస్తుతం ఈ నటి తంగలాన్ అనే సినిమాలో విక్రమ్ తో కలిసి నటిస్తుండటం గమనార్హం. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణాత్మక కార్యక్రమాలను జరుపుకుంటోందని తెలుస్తోంది. తంగలాన్ సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాళవిక ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.

ఇకపై కథకు ప్రాధాన్యత ఉండే సినిమాలలో మాత్రమే నటిస్తానని ఆమె అన్నారు. పాత్రకు ప్రాధాన్యత లేకపోతే 500 కోట్ల రూపాయల సినిమా అయినా నటించనని మాళవిక చెప్పుకొచ్చారు. అలాంటి సినిమాలు సూపర్ హిట్ అయినా నా రోల్ కు గుర్తింపు ఉండదని ఆమె కామెంట్లు చేశారు. ఈ రీజన్ వల్లే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగిందని మాళవిక వెల్లడించారు.

ప్రముఖ నటి మాళవిక (Actress) చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాళవిక మోహన్ కు ఊహించని స్థాయిలో క్రేజ్, పాపులారిటీ పెరుగుతుండటం గమనార్హం. మాళవిక మొహన్ రెమ్యునరేషన్ పరిమితంగానే ఉందని తెలుస్తోంది. తర్వాత ప్రాజెక్ట్ లతో ఈ నటికి భారీ విజయాలు దక్కాలని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మాళవికను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus