నదియా ఫ్యామిలీ పిక్స్ వైరల్!

  • June 5, 2020 / 09:02 PM IST

‘మిర్చి’ చిత్రంలో ప్రభాస్ తల్లిగా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది నదియా. ఆ తరువాత ‘అత్తారింటికి దారేది’ చిత్రంతో ఈమె క్రేజ్ డబుల్ అయ్యిందనే చెప్పాలి. ఆ తరువాత నితిన్ – త్రివిక్రమ్ ల ‘అఆ’, రాంచరణ్ ‘బ్రూస్ లీ’, అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ చిత్రాల్లో కూడా ఈమె నటించింది. అయితే తెలుగులో ‘మిర్చి’ కంటే ముందే.. కృష్ణ పెద్ద కొడుకు నటించిన ‘బజారు రౌడీ’ ‘ఓ తండ్రి ఓ కొడుకు’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది.

కానీ ఆ చిత్రాలు సరిగ్గా ఆడకపోవడంతో ఈమె మళ్ళీ తెలుగు సినిమాల్లో నటించలేదు. ఈమె ముస్లిం అయినప్పటికీ శిరీష్ గోడ్‌బొలె అనే హిందూ వ్యక్తిని పెళ్ళి చేసుకుని లండన్ లో సెటిల్ అయ్యింది. 53 ఏళ్ళ వయసు వచ్చినా.. ఎంతో యంగ్ గా కనిపిస్తుంటుంది నదియా. అయితే ఈమెకు ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారనే సంగతి పెద్దగా ఎవ్వరికీ తెలీదు. ఈమె మొదటి కూతురి పేరు సనమ్. ఏమే 1996లో జన్మించింది.

ఇక చిన్న కూతురు పేరు జానా. ఈమె 2001 లో జన్మించింది. నదియా తన ఫ్యామిలీతో ఉన్న ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇప్పుడు ఈమెకు మళ్ళీ సినిమా అవకాశాలు రావడం లేదని తెలుస్తుంది. మరి ఈ వార్తలో ఎంత వరకూ నిజముందో తెలియాల్సి ఉంది.

1

2

3

4

5

6

7

8

9

10

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus