నా జీవితంలో ఇప్పటివరకూ ప్రభాస్ లాంటి మనిషిని చూడలేదు ..!

  • April 24, 2019 / 12:47 PM IST

టాలీవుడ్లో ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా మారిపోయింది పూజా హెగ్దే. నాగచైతన్య తో ‘ఒక లైలా కోసం’ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమయ్యింది. ఆ తరువాత వరుణ్ తేజ్ డెబ్యూ మూవీ అయిన ‘ముకుంద’ చిత్రంలో కూడా నటించింది. ఆ చిత్రాలు ఆశించిన విజయాల్ని సాధించకపోయినా బాలీవుడ్ లో ఆఫర్ దక్కడంతో వెంటనే అక్కడికి చెక్కేసింది. హృతిక్ సరసన చేసిన ‘మహోంజదారో’ చిత్రం డిజాస్టర్ గా మిగిలింది. దీంతో అక్కడ ఈ అమ్మడిని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో టాలీవుడ్ కు రిటర్న్ వచ్చి అల్లు అర్జున్ తో ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రం చేసింది. ఈ చిత్రం కూడా యావరేజ్ గానే ఆడినప్పటికీ.. ఈ చిత్రంలో పూజా ఓ రేంజ్లో గ్లామర్ షో చేసి యూత్ ను కట్టిపడేసింది. ఇక తరువాత ‘అరవింద సమేత’ చిత్రంలో ఛాన్స్ కొట్టేసి ఎట్టకేలకు సక్సెస్ ట్రాక్ ఎక్కింది.

ప్రస్తుతం మహేష్ బాబు సరసన ‘మహర్షి’, ‘ప్రభాస్ 20’ లో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. ‘మహర్షి’ చిత్రం షూటింగ్ పూర్తయ్యి రిలీజ్ కు రెడీ గా ఉండడంతో.. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో రూపొందుతున్న చిత్రం పై ఫోకస్ పెట్టింది. ఇటీవల పూజా హెగ్దే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి అలాగే ఆ చిత్రం గురించి ఆసక్తికరమైన కామెంట్లు చేసింది. పూజా మాట్లాడుతూ..’ప్రభాస్ తో నటించడం చాలా ఆనందంగా ఉంది.ఇది చాలా మంచి కథ. ఈ చిత్రం కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. ఇక ఇప్పటివరకూ నేను ప్రభాస్‌ లాంటి మంచి మనిషిని చూడలేదు. ఆయన చాలా స్వీట్ పర్సన్‌. అంత గొప్ప స్టార్ అయినా కూడా ఎంతో మర్యాదగా, పద్ధతిగా ఉంటారు” అంటూ చెప్పుకొచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus