ఆ మధ్య ‘అన్స్టాపబుల్’ షోకి వచ్చినప్పుడు దర్శకుడు శంకర్ (Shankar) కుమార్తెల గురించి బాలకృష్ణతో (Nandamuri Balakrishna) మహేష్బాబు (Mahesh Babu) ఓ విషయం గురించి చెప్పారు. మీకు గుర్తుండి ఉంటుంది. ఓ హోటల్లో మహేష్ను ఫొటో అడిగితే.. నో చెప్పారని.. ఆ తర్వాత వాళ్లు శంకర్ కుమార్తెలు అని తెలిసి వెళ్లి మాట్లాడారని. దీని బ్యాక్స్టోరీ ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ క్రమంలో ప్రముఖ టాలీవుడ్ దర్శకుడిని శంకర్ తనయ.. బాడీ గార్డు అనుకుందట. ఈ విషయాన్ని ఆమెనే చెప్పుకొచ్చింది. ‘భైరవం’ (Bhairavam) సినిమా ప్రచారంలో భాగంగా ఈ విషయం తెలిసింది.
‘భైరవం’ సినిమా ప్రచారం కోసం అదితి శంకర్ (Aditi Shankar) తెగ తిరుగుతోంది. టీవీ షోలు, రీల్స్, టాక్ షోలు, యూట్యూబ్ వీడియోలు చేస్తోంది. అలా ఓ కార్యక్రమంలో హోస్ట్ ఆమెను ‘మహేష్బాబును తొలిసారి కలిసినప్పటి’ విషయం గురించి ప్రస్తావించారు. దానికి ఆమె యాజ్ ఇట్ ఈజ్ మహేష్ బాబు చెప్పిన విషయమే చెప్పారు. అయితే మధ్యలో ఓ పాత్రను మార్చేసింది. అంటే ఫ్రెండ్ని బాడీగార్డుని చేసేసింది. ఆమె అలా అనుకుందో లేక ఏమైందో కానీ దర్శకుడు కాస్త బాడీగార్డు అయిపోయారు.
అక్కడేం జరిగిందో తెలిస్తే.. అసలు విషయం మీకు క్లారిటీ వస్తుంది. ఓసారి మారియట్ హోటల్లో మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఈ లోపు ఇద్దరు అమ్మాయిలు వచ్చి ‘సర్ మేం మీ ఫ్యాన్స్ ఒక ఫొటో కావాలి’ అని అడిగారు. దానికి మహేష్ ‘లేదమ్మా ఫ్యామిలీతో వచ్చా.. ఇప్పుడు కుదరదు అంటే వాళ్లు వెళ్లిపోయారు. కాసేపటికి మహేష్ ఫ్రెండ్ దర్శకుడు మెహర్ రమేశ్ (Meher Ramesh) వచ్చి ‘వాళ్లు డైరక్టర్ శంకర్ కుమార్తెలు’ అని చెప్పారు.
దాంతో వెంటనే మహేష్ కిందకు వెళ్లి చూస్తే అక్కడ శంకర్ టిఫిన్ తింటున్నారు. పక్కనే కూతుళ్లు ఉన్నారు. మహేష్ వెళ్లి అసలు విషయం చెబితే.. దాని శంకర్ ‘ఫర్వాలేదు మహేష్.. హీరోలు ఎలా ఉంటారో తెలియాలి కదా’ అని అన్నారు. ఆ తర్వాత అందరూ కాసేపు మాట్లాడుకున్నారు. ‘ఇదేంటి ఇక్కడెక్క బాడీగార్డు అనే మాట రాలేదు కదా’ అంటారా. మధ్యలో మహేష్కి వచ్చి అసలు విషయం చెప్పిన రమేశ్నే అదితి బాడీగార్డు అనుకుంది. అదన్నమాట విషయం.