మూడేళ్ళ తర్వాత హైద్రాబాద్ లో ఐశ్వర్యరాయ్

  • January 4, 2021 / 12:12 PM IST

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ 2007లో అభిషేక్ బచ్చన్ ను పెళ్లి చేసుకొన్న అనంతరం సినిమాల్లో నటించడం తగ్గించిన విషయం తెలిసిందే. అప్పటివరకు ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసుకుంటూ వచ్చిన ఐశ్వర్య, పెళ్లి అనంతరం రెండేళ్లకో సినిమా చేసింది. 2018లో వచ్చిన ఫన్నే ఖాన్ ఆమె నటించగా విడుదలైన ఆఖరి హిందీ చిత్రం. ఆ సినిమా తర్వాత ఆమె మరో సినిమా సైన్ చేయలేదు. ఆమె సినిమా సైన్ చేయకపోవడానికి చాలా కారణాలున్నప్పటికీ..

ముఖ్య కారణం మాత్రం కుటుంబం. అయితే.. తనకు నటిగా జీవితం ఇచ్చిన మణిరత్నం ఆఫర్ ను మాత్రం కాదనలేకపోయింది ఐశ్వర్య. అందుకే.. మణిరత్నం తెరకెక్కిస్తున్న “పొన్నియన్ సెల్వం”లో కీలకపాత్ర పోషించేందుకు ఒకే చెప్పింది. విక్రమ్, కార్తీ, జయం రవి, అమితాబ్, త్రిష, విక్రమ్ ప్రభు, ఐశ్వర్య లేక్ష్మిలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఐశ్వర్య ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ఒక షెడ్యూల్ బ్యాంకాక్ లో పూర్తైన వెంటనే కరోనా & లాక్ డౌన్ మొదలవ్వడంతో.. షూటింగ్ నిలిపివేశారు.

ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో స్పెషల్ సెట్ వేసి షూటింగ్ రీస్టార్ట్ చేశారు. దాంతో దాదాపు మూడేళ్ళ తర్వాత ఐశ్వర్య మళ్ళీ హైద్రాబాద్ లో అడుగుపెట్టింది. ఆమె కుమార్తెతోపాటు భర్త అభిషేక్ బచ్చన్ కూడా ఆమెతో కలిసి రామోజీ ఫిలింసిటీలో ఉంటున్నారు. కొత్త షెడ్యూల్ అయ్యేవరకు వాళ్ళు ఇక్కడే ఉంటారట.

1

2

4

4

5

6

7

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus