Dhruva Natchathiram: అందరూ మర్చిపోయారు ‘ధృవన‌క్ష‌త్రం’ ఇప్పుడు విడుదలైతే లాభం ఉందా?

  • February 9, 2023 / 11:46 AM IST

విక్రమ్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ఓ సినిమా మొదలైంది. అదే ‘ధృవ నక్షత్రం’. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్, సిమ్రాన్ వంటి టాప్ హీరోయిన్లు నటించిన ఈ మూవీకి హారిస్ జయరాజ్ సంగీత దర్శకుడు. ఇది ఒక స్పై థ్రిల్లర్ మూవీ. నిజానికి 2013 లో ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేశారు. మొదట సూర్య, దీపికా పదుకోనె ఈ ప్రాజెక్టులో హీరో హీరోయిన్లు అని ప్రకటించారు.

కానీ కొన్ని కారణాల వల్ల ఆ ఇద్దరు స్టార్లు ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నారు. దీంతో 2015 లో విక్రమ్ తో ఈ ప్రాజెక్టుని స్టార్ట్ చేశాడు దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్. 2017 లో టీజర్ ను కూడా విడుదల చేశారు. కానీ సినిమా రిలీజ్ అవ్వలేదు. ఆర్థిక లావాదేవీల కారణంగా ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. మళ్ళీ కొంతకాలానికి స్టార్ట్ చేశారు.. అయినా కంప్లీట్ చేయలేదు. షూటింగ్ పూర్తయినా ఈ మూవీని ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు.

అయితే ఇటీవల వచ్చిన ‘సర్దార్’ ‘పఠాన్’ వంటి స్పై థ్రిల్లర్ సినిమాలు సూపర్ హిట్ కావడంతో.. ‘ధృవ నక్షత్రం’ చిత్రాన్ని ఈ టైంలో రిలీజ్ చేస్తే మంచి ఫలితాన్ని అందుకోవచ్చు అని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో త్వరలోనే ప్యాచ్ వర్క్ ను ప్రారంభించి..

డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేసి విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోందని సమాచారం. త్వరలోనే ప్రమోషనల్ కంటెంట్ కూడా విడుదల చేయడం ప్రారంభిస్తారని ఇందులో భాగంగా రెండో టీజర్ ను కూడా త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus