‘మిసెస్ ఇండియా-2017’ పోటీల్లో ఫైనల్ కి వెళ్లిన అజయ్ భార్య

  • June 30, 2017 / 06:50 AM IST

‘విక్రమార్కుడు’ సినిమాలో అజయ్‌ విలనిజంతో భయపెట్టాడు. పోకిరిలో విలక్షణ నటనతో అందరి మనసులు గెలుచుకున్నాడు. ఇప్పుడు భర్తగా భార్య మనసు గెలుచుకున్నాడు. అమ్మాయి పెళ్ళికి ముందు తన ఇష్టమైనవనీ చేయొచ్చు..  భార్య గా మారిన తర్వాత కొన్నింటిని వదులుకోవాల్సి వస్తుంది. భర్త ఇష్టప్రకారం నడుచుకోవాల్సి వస్తుంది. భార్య ఇష్టాన్ని ప్రోత్సహించేవారు అతి తక్కువమంది ఉంటారు. అటువంటి వారి జాబితాలో అజయ్ చేరారు. ఆయన భార్య శ్వేత ఇద్దరు పిల్లల తల్లి. అయినప్పటికీ శ్వేతను ‘మిసెస్ ఇండియా-2017’ పోటీలకు పంపించారు.

దేశవ్యాప్తంగా వచ్చిన గట్టి పోటీని ఎదుర్కొని ఆమె ఫైనల్ కి చేరుకున్నారు. టైటిల్ రేసులో నిలిచారు. ఈ విషయాన్ని ఆమె తన ఫేస్‌బుక్ పేజీ ద్వారా వెల్లడించారు. ఫైనల్‌లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. అంతేగాకుండా తన భర్త ప్రోత్సాహంతో ఫైనల్ కి వెళ్లానని వెల్లడించారు. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు అజయ్ కూడా భార్యని ఆశీర్వదించండని అభిమానులను కోరారు. టైటిల్ గెలవాలని ఆకాంక్షను బయటపెట్టారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus