ఆ దర్శకుడితో సినిమా అంటే అజిత్ రిస్క్ చేస్తున్నట్లే!

  • February 9, 2020 / 10:36 PM IST

కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ ప్రస్తుతం వాలిమై చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు. దర్శకుడు హెచ్ వినోద్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం సెట్స్ పై ఉండగానే అజిత్ నెక్స్ట్ మూవీకి సంబంధించిన న్యూస్ బయటికి వచ్చింది. ఆయన తన తదుపరి చిత్రం సీనియర్ దర్శకుడు కె ఎస్ రవి కుమార్ తో చేస్తున్నారు. ఈ విషయాన్నీ దర్శకుడు రవి కుమార్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా వచ్చే ఆగస్టు నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ఐతే ప్రస్తుతం అజిత్ కుమార్ సూపర్ ఫార్మ్ లో ఉన్నారు. ఆయన వరుస విజయాలు అందుకుంటూ కోలీవుడ్ లో దూసుకుపోతున్నారు.

ఈ సమయంలో ఫార్మ్ లో లేని ఈ దర్శకుడితో మూవీ చేయడం అవసరమా అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కె ఎస్ రవి కుమార్ గతంలో రజిని, కమల్ వంటి స్టార్ హీరోలతో ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నారు. ఐతే కొంత కాలంగా ఆయన ట్రాక్ రికార్డు అంతగా ఏమి బాగోలేదు. ఆయన బాలయ్యతో చేసిన రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. 2018 సంక్రాంతి కానుకగా వచ్చిన జై సింహ పరవాలేదు అనిపించినా బాలయ్య స్థాయి హిట్ ఐతే కాదు. ఇక గత ఏడాది క్రిస్మస్ కానుకగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన రూలర్ విడుదలై బాలయ్యకు ఓ పెద్ద డిజాస్టర్ అంటగట్టింది. ఈ నేపథ్యంలో అజిత్ ఆయనతో సినిమా చేయడం రిస్క్ అనే చెప్పాలి.

Most Recommended Video

జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus