మిస్టర్ మజ్ను గురుంచి మేజర్ అప్డేట్ ఇచ్చిన అఖిల్

  • November 28, 2018 / 07:01 AM IST

అక్కినేని మూడో తరం అందగాడు అఖిల్ నటిస్తున్న మూడో చిత్రం ‘మిస్టర్ మజ్ను’. ‘తొలిప్రేమ’ చిత్రంతో దర్శకుడిగా విశేషమైన ఇమేజ్ సంపాదించుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ మొదలై ఆరేడు నెలలు పూర్తి కావస్తున్నా ఇప్పటివరకు టీజర్ ను రిలీజ్ చేయడం మినహా.. సినిమాకి సంబంధించిన మరో అప్డేట్ ఇవ్వలేదు చిత్రబృందం. ముఖ్యంగా సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది అసలు ఎవరూ వెల్లడించలేదు. దాంతో ఈ సినిమా సమ్మర్ రిలీజ్ అని కొందరు, ఇప్పుడప్పుడే రిలీజ్ అవ్వదని ఇంకొందరు మాట్లాడుకోవడం మొదలెట్టారు. ఈ కన్ఫ్యూజన్ కు క్లారటీ ఇవ్వడం కోసం స్వయంగా అఖిల్ బాబే రంగంలోకి దిగాడు.

ఇవాళ ఉదయాన్నే తన ట్విట్టర్ ద్వారా.. ‘మిస్టర్ మజ్ను చిత్రీకరణ పూర్తయింది, పాటలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోంది, జనవరిలో మీ ముందుకు రానున్నాం’ అంటూ ట్వీట్ చేసాడు అఖిల్. దాంతో ‘మిస్టర్ మజ్ను’ సంక్రాంతి రిలీజ్ అని స్పష్టమైంది. అఖిల్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మరో ఆరుగురు హీరోయిన్లు ఉన్నారట. అఖిల్ ఈ చిత్రంలో ప్లేబోయ్ గా కనిపించనున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus