Akshy Kumar: దర్శకుడు రమేష్ వర్మ పెద్ద స్కెచ్చే వేసాడుగా..!

  • August 11, 2021 / 11:33 AM IST

తమిళంలో సూపర్ హిట్ అయిన ‘రాట్ససన్’ మూవీ తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ‘రాక్షసుడు’ టైటిల్ తో రీమేక్ అయిన సంగతి తెలిసిందే. 2019 వ సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. దర్శకుడు రమేష్ వర్మ ఒరిజినల్ ను ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా చాలా చక్కగా తెలుగులోకి రీమేక్ చేసాడు. నిర్మాతకు చాలా వరకు డబ్బులు మిగిలేలా చేసాడు. ‘ఎ స్టూడియో’ బ్యానర్ పై హవీష్, సత్యనారాయణ కోనేరు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇక ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘రాక్షసుడు2’ ని రూపొందించడానికి కూడా రెడీ అయినట్టు ఇటీవల అధికారికంగా ప్రకటించారు. రమేష్ వర్మనే ఈ సీక్వెల్ కు కూడా దర్శకుడు. అయితే ‘రాక్షసుడు2’ ఒరిజినల్ లో రూపొందలేదు. అయితే ఇక్కడ తెరకెక్కించడానికి నిర్మాతలు రెడీ అయ్యారు. అది కూడా పాన్ ఇండియా లెవెల్లో.. రూ.100 కోట్ల బడ్జెట్ తో ఈ ప్రాజెక్టుని రూపొందించబోతున్నట్టు కూడా ప్రకటించారు. తెలుగులో రూ.15 కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీకి రూ.100 కోట్లు పెట్టి సీక్వెల్ తీయడం ఏంటి అని అంతా షాక్ అయ్యారు.

కానీ ఇక్కడే ఎవ్వరూ ఊహించని విధంగా దర్శకనిర్మాతలు స్టెప్ వేయబోతున్నారు. హిందీలో ఈ ‘రాక్షసుడు’ ‘రాక్షసుడు2’ లను అక్షయ్ కుమార్ తో రూపొందించనున్నారట. తెలుగు, తమిళ భాషల్లో వేరే హీరోలు ఉంటారు. ఇలా మొత్తానికి కలిపి వాళ్ళు బడ్జెట్ వేసుకున్నట్టు తెలుస్తుంది.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus