‘ఓటిటి ఈజ్ టుమారో.. దీనిని శత్రువుగా చూడకూడదు.. అందుకే ‘ఆహా’ మొదలు పెట్టాను’ అంటూ అల్లు అరవింద్ గారు ‘ఆహా’ లాంచింగ్ ఈవెంట్ లో తెలియజేసారు. భవిష్యత్తులో ఓటిటి కూడా టాప్ లో ఉంటుందని ఆయన ముందే గ్రహించి.. మొదటి అడుగు వేసేసారని అందరూ అనుకున్నారు. ఈ వైరస్ మహమ్మారి వల్ల థియేటర్లు మూతపడటంతో.. ‘ఓటిటి’ ల విలువ ఇప్పుడు అందరికీ తెలిసొచ్చింది. ఇప్పటికే పలు సినిమాలు డైరెక్ట్ గా ఓటిటిలో విడుదలయ్యాయి.
ప్రేక్షకులంతా ఇప్పుడు ఇళ్లల్లోనే ఉంటున్నారు కాబట్టి.. ఓటిటికి మరింత డిమాండ్ పెరిగిందనే చెప్పాలి. అయితే కంటెంట్ మాత్రం తక్కువగానే ఉంటుంది. వారానికి ఓ సినిమా విడుదలవుతుందని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అందుకే అరవింద్ గారు డైరెక్ట్ గా ఓ పెద్ద సినిమాని విడుదల చెయ్యాలని భావిస్తున్నారట. ఇందులో భాగంగా.. ‘వి’ చిత్రాన్ని డైరెక్ట్ గా ఓటిటిలో విడుదల చెయ్యమని ఆ చిత్రం నిర్మాత అయిన దిల్ రాజుని .. అల్లు అరవింద్ గారు కాంటాక్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది.
అయితే దిల్ రాజు ఎంతో ఇష్టపడి.. రాజీపడకుండా నిర్మించిన సినిమా ఇది. కచ్చితంగా ‘వి’ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ ఇవ్వాలని ఆయన పట్టుపట్టి కుర్చున్నారట. అమెజాన్ సంస్థ 30 కోట్లు ఆఫర్ ఇచ్చినా.. దిల్ రాజు టెంప్ట్ అవ్వలేదట. అయితే అల్లు అరవింద్ గారు అంతకు మించిన రేటు చెప్పి ‘వి’ ని ఎట్టిపరిస్థితుల్లోనూ ‘ఆహా’ లోనే విడుదల చెయ్యమని దిల్ రాజు పై ఒత్తిడి పెంచుతున్నారట. ఈ క్రమంలో దిల్ రాజు.. యెస్ అని చెప్పలేక నో అని చెప్పలేక సతమతమవుతున్నట్టు వినికిడి.