బన్నీ మార్క్ బిజినెస్

  • May 16, 2016 / 01:06 PM IST

సినిమా హిట్ కావాలని కొందరు నిర్మాతలు ప్రచార సమయంలో అనేక ట్రిక్ లు ప్లే చేస్తుంటారు. ఇప్పుడు ఆ ట్రిక్కులు అల్లు అర్జున్ ప్లే చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా ఆడియో వేడుకలోనే “చెప్పను బ్రదర్” అని డైలాగ్ చెప్పి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు.

మెగాస్టార్ చెట్టు నీడన పెరిగిన మొక్కలం మేము అని డైలాగులు చెప్పే అల్లు అర్జున్ .. పవన్ గురించి మాట్లాడమని ఫాన్స్ అడిగితే “చెప్పను బ్రదర్” అని డైరక్ట్ గా చెప్పడం వెనుక పెద్ద ప్లాన్ ఉందని ఫిలిం నగర్ లో కొత్త గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకని అని అడిగితే వారు చెప్పిన కారణం ఏమిటంటే..
సినిమా హిట్ అయిన సందర్భంగా ఏర్పాటు చేసినా ప్రెస్ మీట్ లో కూడా “చెప్పను బ్రదర్” అని అల్లు అర్జున్ చెప్పారు. దీంతో అల్లు అరవింద్ బాధపడినట్లు, చిరంజీవి అల్లు అర్జున్ కి క్లాస్ తీసుకున్నట్లు, త్వరలోనే అల్లు అర్జున్ ఈ విషయం ఫై క్లారిటీ ఇవ్వనున్నట్లు లీకేజే లు ఇస్తున్నారు. ఆడియో ఫంక్షన్ తర్వాత రోజే క్లారిటీ ఇవ్వమని చెప్పవచ్చు కదా.. ఇప్పటి దాకా ఆగాలా? అని ప్రశ్నిస్తున్నారు.

సినిమాలోనే కాదు బయట కూడా అర్జున్ బాగా నటిస్తున్నాడని చెబుతున్నారు. తన మాటలతో చర్చ లేపి డబ్బులు రాగానే మళ్లీ ఆ మంటను చల్లార్చడానికి సరైనోడు మీడియా ముందుకు త్వరలోనే వస్తాడని నమ్మకంగా చెబుతున్నారు. ప్రెస్ ముందుకు వచ్చి “తూచ్ .. అదంతా కామెడి” అని చెబుతాడా? ఇక నుంచి మెగా మచ్చ లేకుండా సినిమా రంగంలో ఎదుగు తాడా? అనేది కొన్ని రోజుల్లోనే తెలిసిపోతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus