అందుకే అల్లు బ్యాచ్ అందర్నీ మచ్చిక చేసుకొంటున్నారా.!

  • May 3, 2018 / 12:34 PM IST

‘దువ్వాడ జగన్నాధం’ సినిమా రిలీజ్ టైమ్ లో మీడియాకు కనీసం ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించని అల్లు అర్జున్  ‘నా పేరు సూర్య’ రిలీజ్ కి రెడీ అయ్యేప్పటికి మాత్రం మీడియా అటెన్షన్ దారుణంగా కోరుకొంటున్నాడు. అందుకే ఎన్నడూ లేని విధంగా తన పుట్టినరోజు వేడుకలు ఒక రెండు రోజులు ముందు మీడియాతో కలిసి సెలబ్రేట్ చేసుకొన్నాడు. అలాగే నిన్న సాయంత్రం మీడియా కోసం స్పెషల్ పార్టీ కూడా ఇచ్చాడు.

ఇక మొన్నటివరకూ “చెప్పను బ్రదర్” అంటూ మెగా ఫ్యాన్స్ ను రెండు వర్గాలుగా విడగొట్టిన బాబు ఉన్నట్లుండి ఫిలిమ్ ఛాంబర్ లో పవన్ కళ్యాణ్ ను కలవడం, ప్రీరిలీజ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ను ముఖ్య అతిధిగా ఆహ్వానించడం వంటివి ఒక ప్లాన్ ప్రకారం చేశాడు.

ఇప్పుడు అల్లు అర్జున్ అండ్ అల్లు అరవింద్ లు ఇలా మెగా అభిమానులను, పాత్రికేయ మిత్రులను కలుపుకుపోవడం వెనుక అసలు కారణం వేరే ఉందని తెలుస్తోంది. “నా పేరు సూర్య” సినిమాకి ఇప్పటివరకు ఏ సినిమాకీ లేనంతగా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఆ కారణంగా సినిమాకి ప్రారంభవసూళ్ళు ఉన్నప్పటికీ.. లాంగ్ రన్ లో ఆ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా బన్నీ ఇవన్నీ ఫాలో అవుతున్నాడని ఫిలిమ్ నగర్ వర్గాల టాక్. మరి సినిమా రిజల్ట్ ఏమిటనేది ఇంకొన్ని గంటల్లో తెలిసిపోతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus