అల్లు అర్జున్, వక్కంతు వంశీ చిత్రానికి ఖరారైన ముహూర్తపు తేదీ

  • February 17, 2017 / 12:32 PM IST

హరీష్ శంకర్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న దువ్వాడ జగన్నాథమ్ సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ఫిల్మ్ ఫస్ట్ లుక్ రేపు (18 ) ఉదయం 8 .45  గంటలకు రిలీజ్ కానుంది. ఈ మూవీ ఇంకా షూటింగ్ పూర్తికాకముందే బన్నీ తర్వాతి సినిమాను సెట్ జేశారు. రచయిత వక్కంతం వంశీ ని డైరక్టర్ గా పరిచయం చేయడానికి సిద్ధమయ్యారు. అతని దర్శకత్వంలో చేయనున్న మూవీకి తాజాగా ముహూర్తపు తేదీని ఫిక్స్ చేశారు.

లగడపాటి శ్రీధర్ నిర్మించనున్న ఈ సినిమాని అల్లు అర్జున్ పుట్టిన రోజు అయిన ఏప్రిల్ 8 న ప్రారంభించాలని డైరక్టర్ ఫిక్స్ అయ్యారు. ‘నా పేరు సూర్య.. నా ఊరు ఇండియా’ అనే టైటిల్ తో పరిశ్రమ వర్గాలను ఆకర్షించిన ఈ మూవీకి బాలీవుడ్ సంగీత దర్శకుడు ప్రీతమ్ ని తీసుకొని ఆసక్తిని మరింత పెంచారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus