Allu Arjun: వైరల్ అవుతున్న బన్నీ దంపతుల ఫోటో.. రోడ్డు పక్కన దాబాలో ఫుడ్ తింటూ?

  • May 21, 2024 / 03:48 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను (Allu Arjun) తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులతో పాటు ఇతర భాషల అభిమానులు సైతం ఎంతో అభిమానిస్తారు. బన్నీ, స్నేహారెడ్డి క్యూట్ కపుల్ అని ఫ్యాన్స్ ఫీలవుతారు. కొన్నిరోజుల క్రితం బన్నీ దంపతులు నంద్యాలలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తరపున ప్రచారం చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేయడం వల్ల బన్నీ కొన్ని వివాదాల్లో సైతం చిక్కుకున్నారు.

అయితే నంద్యాల నుంచి హైదరాబాద్ కు వస్తున్న సమయంలో బన్నీ రోడ్డు పక్కన ఉన్న ఒక దాబాలో ఫుడ్ టేస్ట్ చేసినట్టు తెలుస్తోంది. భార్యతో కలిసి బన్నీ భోజనం చేస్తుండగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. బన్నీ దంపతుల సింప్లిసిటీకి ఫిదా అవ్వాల్సిందే అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. పాన్ ఇండియా హీరో అయినా ఇంత సింపుల్ గా ఉండటం బన్నీకే సాధ్యమని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

అయితే ఈ ఫోటోలకు సంబంధించి బన్నీ టీమ్ నుంచి మరింత స్పష్టత రావాల్సి ఉంది. సాధారణ వ్యక్తిలా స్టార్ హీరో భోజనం చేయడం విషయంలో ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు. గతంలో కూడా బన్నీ ఒక సాధారణ హోటల్ లో ఫుడ్ టేస్ట్ చేసి వార్తల్లో నిలిచారు. బన్నీ తన సింప్లిసిటీతో అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువ అవుతూ ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకుంటున్నారని ఫ్యాన్స్ చెబుతున్నారు. పుష్ప ది రూల్ (Pushpa 2) ఫస్ట్ సింగిల్ తో సరికొత్త రికార్డులను ఖాతాలో వేసుకున్న బన్నీ తర్వాత పాటలతో సైతం అదే స్థాయిలో మెప్పిస్తారేమో చూడాలి.

బన్నీ డీఎస్పీ (Devi Sri Prasad) సుకుమార్ (Sukumar) కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. పుష్ప ది రూల్ ప్రమోషన్స్ ను సైతం భారీ లెవెల్ లో ప్లాన్ చేశారని ఆగష్టు 15న పుష్ప2 సినిమాతో బన్నీ మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంటారని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఈ సినిమాలో ట్విస్టులు మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని స్క్రీన్ ప్లే విషయంలో సుకుమార్ ఎంతో కసరత్తు చేసి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus