పవన్ కళ్యాణ్ ని అభినందించిన అల్లు శిరీష్

  • August 3, 2017 / 06:07 AM IST

సరైనోడు చిత్రం నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అల్లు హీరోల మధ్య గొడవ మొదలయింది. ఆ విషయాన్నీ అభిమానులు మరింత పెద్దది చేశారు. మెగా అభిమానులు అయితే విడిపోయి మరీ ఒకరి మీద ఒకరు బురదలు చల్లుకున్నారు. అయితే ఫ్యాన్స్ అనుకున్నంత దూరం పవన్ కి అల్లు హీరోలకి లేదనిపిస్తోంది. రీసెంట్ గా అల్లు శిరీష్ చేసిన పోస్ట్ దీనిని స్పష్టం చేసింది. రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి ఉద్దానం సమస్యపై చర్చలు జరిపారు. సమస్య పరిష్కారానికి కలిసి అడుగులు వేశారు. ఈ సమావేశంపై అల్లు శిరీష్ స్పందిస్తూ చంద్రబాబు ట్విట్టర్లో ఉద్దానం పట్ల ఇంత శ్రద్ద చూపిస్తున్నందుకు పవన్ ను అభినందిస్తున్నాని ట్వీట్ చేశారు.

అంతేకాదు “ఇద్దరు నాయకులు రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం పనిచేయడం గొప్ప విషయం” అని చెప్పారు. శిరీష్ ట్వీట్ ని చూసిన చంద్రబాబు అతనికి థ్యాంక్స్ చెబుతూ ప్రజలే తమకు ముఖ్యమని, వాళ్ల కోసమే పనిచేస్తామంటూ రీ ట్వీట్ చేశారు. పవన్ ని ట్విట్టర్ వేదికపై అల్లు శిరీష్ ప్రశంసించడంతో.. వారిద్దరి మధ్య ఎటువంటి గొడవ లేదని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. మెగా హీరోలా సపోర్ట్ లేకపోవడంతో దువ్వాడ జగన్నాథం ఘోరంగా దెబ్బ తిందని, ఆ దెబ్బతో అల్లు హీరోల ఆలోచనలో మార్పు వచ్చిందని విమర్శించేవారు లేకపోలేదు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus