శిరీష్ ట్వీట్ వెనుక ఆంతర్యం ఏంటో?

  • August 4, 2017 / 07:38 AM IST

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి  ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు…మెగాస్టార్ తో మొదలైన ఈ క్రేజ్ ఇప్పుడున్న యువ హీరోలకి కూడా ఉంది అంటే, ఆ కుటుంభానికి ఎంత మంచి ఫాన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉందో ఇట్టే అర్ధం అయిపోతుంది. విషయంలోకి వెళితే, టాలీవుడ్ లో మెగా హీరోల్లో ఒకడైన అల్లు శిరీష్ ఎలా అయినా మంచి హిట్ అందుకోవాలి అన్న ఆలోచనలో సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటివరకూ శిరీష్ నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా చప్పుడు చెయ్యకపోవడంతో ఎలా అయినా పాపం పవన్ ఫాన్స్ ను కాస్త తనవైపు తిప్పికోవాలి అని ప్లాన్ వేసినట్లుగా ఒక ట్వీట్ చేశాడు అంటూ వార్తలు వస్తూ ఉన్నాయి…విషయం లోకి వెళితే…గత కొన్నాళ్లుగా పవన్ కళ్యాణ్ కు అల్లుఅర్జున్ కు మధ్య విపరీతమైన గ్యాప్ ఏర్పడింది అన్న ప్రచారం జరుగు తున్న విషయం తెలిసిందే. దీనికి తగ్గట్టుగా అల్లుఅర్జున్ అన్యాపదేశంగా చేస్తున్న కామెంట్స్ పవన్ ను టార్గెట్ చేసేవిగా ఉండటంతో పవన్ అభిమానులకు అల్లుఅర్జున్ శత్రువుగా మారిపోయాడు. దీనితో పవన్ అభిమానులు తమకు ఏమాత్రం అవకాశం వచ్చినా బన్నీని టార్గెట్ చేస్తూ తెగ హడావిడి చేస్తున్నారు.

అయితే ఈ ప్రాబ్లమ్ తనకు రాకుండా ఉండాలి అన్న ఆలోచనో ఏమో తెలీదు కానీ, అల్లు శిరీష్ తాజాగా చేసిన ఒక ట్వీట్ మాత్రం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఇంతకీ ఏంటి ఆ ట్వీట్ ఏమీ ఆ కధ అంటే, రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి ఉద్దానం సమస్యపై చర్చలు జరిపి సమస్య పరిష్కారం దిశగా అడుగు వేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తెలుపుతూ చంద్రబాబు ట్విట్టర్లో ఉద్దానం పట్ల ఇంత శ్రద్ద చూపిస్తున్నందుకు పవన్ ను అభినందిస్తున్నాను అంటూ ట్విట్ చేసారు. దానికి ప్రతిగా అల్లు శిరీష్ ఇద్దరు నాయకులు రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం పనిచేయడం గొప్ప విషయం అంటూ తన అభిప్రాయాన్ని తెలిపాడు. శిరీష్ అభిప్రాయాన్ని చూసిన చంద్రబాబు అతనికి థ్యాంక్స్ చెబుతూ ప్రజలే తమకు ముఖ్యమని వాళ్ళ కోసమే పనిచేస్తామంటూ బదులిచ్చారు. పాలిటిక్స్ కి పూర్తిగా దూరంగా ఉండే శిరీష్ హాటాత్తుగా ఇలా ట్వీట్ చెయ్యడం చూస్తూ ఉంటే పవన్ నామస్మరణ కోసమే అన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి..అదీ మరి మ్యాటర్.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus