గజరాజుని ఎక్కిన బాహుబలి బొమ్మను గీసిన ఆర్టిస్ట్

  • March 14, 2017 / 01:36 PM IST

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి మూవీ ఎంతోమందిలో స్ఫూర్తిని కలిగించింది. ఆ చిత్రంలో ప్రతి క్యారక్టర్ తో ప్రేక్షకులు కనెక్ట్ అయి ఉన్నారు. అందుకే అనేకమంది యువ కళాకారులు బాహుబలి, భల్లాల దేవా, దేవసేన, కట్టప్ప లని పేపర్ పై అందంగా గీశారు. ఇప్పుడు అంతకుమించి అద్భుతాన్ని ఆవిష్కరించాడు ఓ అభిమాని. స్యాండ్ ఆర్ట్ (ఇసుకతో గ్లాసుపై బొమ్మ వేయడం) ద్వారా బాహుబలి కంక్లూజన్ సెకండ్ మోషన్ పోస్టర్ ని గీసి శెభాష్ అనిపించుకున్నాడు.

గజరాజుని ఎక్కిన బాహుబలి  చిత్రాన్ని మొదటి నుంచి ఎలా గీస్తారో ఆ విధానాన్ని వీడియోలో బంధించి యూట్యూబ్ లో అప్ లోడ్ చేశాడు. వైభవ్ సి వేసిన ఈ ఆర్ట్ బహుబలి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. అధిక లైక్లు, షేర్లు అందుకుంటోంది. మీరు కూడా చూడాలంటే  కింది వీడియోని క్లిక్ చేయండి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus