Pelli SandaD : ఓటీటీలోకి కూడా వస్తా అంటున్న దర్శకేంద్రుడు

  • April 28, 2021 / 12:25 PM IST

తెలుగు సినిమా చరిత్రలో ‘పెళ్ళి సందడి’ సినిమాకు ఓ పేజీ ఉంటుంది అనడంతో ఎలాంటి అతిశయోక్తి. వినోదం, ప్రేమను మేళవించి ఆ రోజుల్లో రాఘేవంద్రరావు అదరగొట్టేశారు. శ్రీకాంత్‌, దీప్తి భట్నాగర్‌, రవళి తమ పాత్రల్లో జీవించి మెప్పించారు. దర్శకేంద్రుడు ‘కుప్ప’గా అభివర్ణించే ఆ సినిమా కమెడియన్ల గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే. మరి అలాంటి సినిమాకు సీక్వెల్‌ వస్తోంది అంటే ఎలా ఉండాలి? ఎంత బాగుండాలి అనేది ఓ విషయమైతే… అసలు ఆ ఆలోచన ఎలా వచ్చిందో తెలుసుకోవాలి కదా. ఆ మాటలు దర్శకేంద్రుడి మాటల్లోనే…

‘పెళ్లిసందD’ ఇప్పుడు తెరకెక్కుతుండటానికి కారణాల్లో ఒకరు జక్కన్న రాజమౌళి అయితే, ఇంకొకరు మరకతమణి కీరవాణి అట, మరొకరు రచయిత సత్యానంద్‌ అట. ‘పెళ్లిసందడి’కి కొనసాగింపుగా సినిమా తీస్తే చూడాలని ఉందని రాజమౌళి, కీరవాణి, సత్యానంద్‌ రాఘవేంద్రరావును చాలాసార్లు అడిగారట. అలా ఆ సమయంలో ఆయన నుంచి నాలో ఆలోచన మొదలైందట. ఏం చేద్దామా అని ఆలోచిస్తున్న సమయంలో ఆయన దగ్గర చాలా ఏళ్లుగా రచయితగా పనిచేస్తున్న గౌరి రోణంకి సీక్వెల్‌ ఐడియా చెప్పారట.

గౌరీ చెప్పిన పాయింట్‌ను పట్టుకొని, డెవెలప్‌ చేస్తే ‘పెళ్లిసందD’ కథ సిద్ధమైందట. ఇప్పుడు ఆమె దర్శకత్వంలోనే ‘పెళ్లిసందD’ రూపొందుతోంది. స్క్రీన్‌ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలు రాఘవేంద్రరావు చూస్తున్నారు. చాలావరకు షూటింగ్‌ పూర్తయిపోయిందట. మరో రెండు, మూడు రోజులు షూటింగ్‌ చేస్తే సరి. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పూర్తి చేసి… త్వరలోనే విడుదల చేస్తారట. అన్నట్లు సినిమాలు, టీవీల్లో తన ముద్ర వేసిన రాఘవేంద్రావు ఓటీటీలోకి కూడా వస్తా అని చెబుతున్నారు. త్వరలో ఆ వివరాలు వెల్లడిస్తారట.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus