మహేష్ ‘సర్కారు వారి పాట’ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

  • February 3, 2021 / 04:14 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్(బుజ్జి) డైరెక్షన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ‘మైత్రి మూవీ మేకర్స్’ ’14 రీల్స్ ప్లస్’ ‘జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ల పై నవీన్ యర్నేని,వై.రవి శంకర్,రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట లు, మహేష్ బాబు లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు.ఆర్.మది సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. కాగా ఈ చిత్రం షూటింగ్ జనవరి ఎండింగ్ లో దుబాయ్ లో మొదలైనట్టు నిర్మాతలు ప్రకటించారు.

ప్రస్తుతం రామ్ లక్ష్మణ్ సారథ్యంలో కొన్ని పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట. సినిమాలో ఇవి హైలెట్ గా నిలుస్తాయని యూనిట్ సభ్యుల ధీమాగా చెబుతున్నారు. బ్యాంకింగ్ కుంభకోణాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోందట.ఈ చిత్రంలో మహేష్ బాబు పాత్ర క్లాస్,మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుందని తెలుస్తుంది. కథ ప్రకారం ఈ చిత్రంలో మరో హీరోయిన్ కూడా ఉంటుందని టాక్. అందుకోసం నివేదా థామస్ లేదా బాలీవుడ్ నటి సాయి మంజ్రేకర్ ను సంప్రదిస్తున్నట్టు సమాచారం.

ఇక 2022 లో సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చెయ్యబోతున్నట్టు నిర్మాతలు ఇటీవల సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు గత చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ కూడా సంక్రాంతికే విడుదలయ్యి ఘన విజయం సాధించింది.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus