Anasuya: మెగా హీరోలకి సెంటిమెంట్ గా మారిపోయిన రంగమ్మత్త..!

  • August 24, 2021 / 05:09 PM IST

‘జబర్దస్త్’ గ్లామరస్ యాంకర్ అనసూయ భరద్వాజ్‌ క్రేజ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓ పక్క బుల్లితెర పై స్టార్ యాంకర్ గా రాణిస్తూనే మరోపక్క మంచి మంచి పాత్రలతో వెండితెర పై కూడా సందడి చేస్తుంది. ఈమె ఇప్పుడు ఎవ్వరికీ కాల్షీట్లు ఇవ్వలేనంత బిజీగా గడుపుతోంది.ఇదిలా ఉండగా.. ఈమెకు వరుసగా మెగా హీరోల సినిమాల్లో ఆఫర్లు లభిస్తుండడం విశేషం.ఆల్రెడీ ఈమె ‘పుష్ప’ ‘ఆచార్య’ సినిమాల్లో నటిస్తుంది. అలాగే చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘లూసీఫర్’ రీమేక్ ‘గాడ్ ఫాథర్’ లో కూడా ఈమె ఓ కీలక పాత్ర పోషిస్తుంది.

ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే మెగాస్టార్ పుట్టిన రోజు నాడు తెలియజేసింది. అలాగే ఈమె చిరంజీవి గురించి మాట్లాడుతూ.. ‘చిరంజీవి గారంటే నాకు ఎంతో అభిమానం, ఆయన పేరు చెబితే భక్తి,మర్యాద అనే ఫీలింగ్స్ కలుగుతాయి. ‘రంగస్థలం మూవీ వేడుకల్లో ఆయన నా నటన చాలా బాగుంది అంటూ ప్రశంసించారు’ అంటూ చెప్పుకొచ్చింది అనసూయ. ‘రంగస్థలం’ మూవీతోనే అనసూయ క్రేజ్ మరింతగా పెరిగిందని చెప్పాలి. అలాగే తమ సినిమాల్లో అనసూయ నటిస్తే బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనే ఆలోచనకి కూడా మెగా హీరోలు వచ్చేసారు.

వరుణ్ తేజ్ ‘ఎఫ్2’ మూవీలో కూడా ఈమె నటించింది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూవీలో కూడా అనసూయని ఓ కీలక పాత్రకి ఎంపిక చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే అది ఏ మూవీ అన్న విషయం పై ఇంకా క్లారిటీ రాలేదు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus