నాకు ముందే అనుమానం వచ్చింది : అనసూయ

  • June 16, 2018 / 01:55 PM IST

తెలుగు చిత్రపరిశ్రమపై మరో మచ్చ పడింది. తెలుగువారు తలదించుకునే సంఘటన అమెరికాలో వెలుగుచూసింది. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు హీరోయిన్లు అమెరికాలోని షికాగో కేంద్రంగా నడిపిస్తున్న ‘సెక్స్ రాకెట్’ లో దొరికారు. దీనిని నిర్వహిస్తున్న కిషన్ మోదుగుముడి (34),  అతడి భార్య చంద్రకళ పూర్ణిమ మోదుగుమూడి ని అరెస్ట్ చేశారు.  చంద్రకళ  లైంగిక వ్యవహారాలకు సంబంధించిన చిట్టాపద్దులు రహస్యంగా నిర్వహించేదని, ఒక్కో నటి ఎన్నిసార్లు పాల్గొన్నది, ఎంత డబ్బు చేతులు మారింది తదితర వివరాలు ఆమె నమోదు చేసేదని దర్యాప్తు అధికారులు తెలిపారు. దంపతుల ఇంటిపై దాడులు జరిపినప్పుడు వారి ఇంట్లోని మల్టిపుల్‌ జిప్‌లాక్‌ బ్యాగుల్లో 70 కండోమ్‌లు లభించాయని చెప్పారు.

దంపతులు అరెస్టు కావడంతో వారి పిల్లలను వర్జినియాలోని బాలల సంరక్షణ అధికారుల ఆశ్రయంలో ఉంచారు. ఈ సెక్స్‌ రాకెట్‌ పై యాంకర్ అనసూయ స్పందించింది. తనకు ఈ దంపతులపై ముందుగానే అనుమానం వచ్చిందని వెల్లడించింది. “అమెరికా దంపతులు గతంలో నన్ను కూడా వేడుకల్లో పాల్గొనాలని సంప్రదించారు. నన్ను సంప్రదించిన వ్యక్తి మాట్లాడే విధానం నచ్చక ఆఫర్‌ను తిరస్కరించాను” అని అనసూయ మీడియాకి తెలిపారు. అలాగే వివాదాస్పద నటి శ్రీ రెడ్డి కూడా ఈ ఘటనపై ఓ పత్రికతో మాట్లాడింది.” అవకాశాల్లేని నటీమణులు అమెరికా వెళ్లి అక్కడి వ్యభిచారానికి ఆకర్శితులవుతున్నారు. ఆర్టిస్టులకు రోజుకి  1000 డాలర్లు ఇస్తున్నారు. ఈ ధర వారి పాపులారిటీని బట్టి ఉంటుంది” అని శ్రీ రెడ్డి వెల్లడించారు. ఇంకెన్ని నిజాలు బయటపడతాయోనని మీడియా అంతా ఈ ఘటనపై ఫోకస్ పెట్టింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus