విజయ్ దేవరకొండ చిత్రంలో తన పాత్ర పై అనసూయ క్లారిటీ ..!

  • January 31, 2019 / 10:35 AM IST

ఒక పక్క హీరోగా వరుస చిత్రాలు చేస్తూనే.. నిర్మాణ రంగం వైపు కూడా అడుగులు వేయబోతున్నాడట మన సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ. తనని ‘పెళ్ళి చూపులు’ అనే చిత్రంతో హీరోగా నిలబెట్టిన తరుణ్ భాస్కర్ ను హీరోగా పరిచయం చేస్తూ ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడిగా పెళ్ళి చూపులు’ ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి  చిత్రాలను తెరకెక్కించాడు తరుణ్ భాస్కర్. ‘మహానటి’ చిత్రంలో కూడా ఓ గెస్ట్ రోల్ లో కనిపించాడు. ఇక ప్రస్తుతం పూర్తిస్థాయి నటుడిగా మారబోతున్నాడట తరుణ్ భాస్కర్. విజయ్ దేవరకొండ నిర్మించబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చక చకా జరుగుతున్నాయని తెలుస్తుంది. అయితే ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్ సరసన హీరోయిన్ గా హాట్ యాంకర్ అనసూయ నటించబోతుందని, సినిమాలో ఆమె పాత్ర చాలా గ్లామరస్ గా ఉండబోతుందని… తరుణ్ భాస్కర్ తో రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉంటాయని గత కొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఈ వార్తల పై స్పందించింది అనసూయ. ఈ విషయం పై అనసూయ స్పందిస్తూ… ” తరుణ్ భాస్కర్ తో నటిస్తున్న మాట నిజమే కానీ.. అది రొమాంటిక్ పాత్ర కాదు. ఇప్పటి వరకూ అలాంటి గ్లామర్ పత్రాలు చేయలేదు.. చేయను కూడా..! అయితే ఈ చిత్రం నా కెరీర్ ని మరింత ముందుకు తీసుకువెళ్ళేలా ఆ పాత్ర ఉంటుంది. త్వరలోనే సినిమా ప్రారంభమవుతుంది… అప్పుడు నా పాత్ర గురించి పూర్తి వివరాలు తెలియజేస్తాను” అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇక అనసూయ ప్రస్తుతం ‘కథనం’ అనే చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రంలో ఆమె కో – డైరెక్టర్ రోల్ లో కనిపించబోతుందని సమాచారం. ఫిబ్రవరి లేదా మార్చ్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus