Rashmi Gautam: ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అంటున్న రష్మీ..?

  • April 20, 2021 / 08:00 PM IST

జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా గుర్తింపును సొంతం చేసుకున్న రష్మీ గౌతమ్ ఎమోషనల్ అయ్యారు. జబర్దస్త్ షోకు ముందు చాలా సినిమాల్లో నటించినా జబర్దస్త్ షో ద్వారానే రష్మీ గౌతమ్ కు గుర్తింపు వచ్చింది. ఇతర ఛానెళ్లలో ఆఫర్లు వస్తున్నా రష్మీ మాత్రం ఈటీవీ ఛానల్ లోని షోలతో పాటు ఆ షో ఈవెంట్లకు పరిమితం కావడం గమనార్హం. రోజురోజుకు పెరుగుతున్న కేసులపై రష్మీ కీలక వ్యాఖ్యలు చేశారు.

సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉండే రష్మీ మూగజీవాల విషయంలో స్పందిస్తూ పోస్టులు ఎక్కువగా పెడుతుంటారు. సామాజిక బాధ్యత ఎక్కువగా ఉండే రష్మీ రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల గురించి స్పందిస్తూ ప్రజలు ఎక్కడికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు. కరోనాను తేలికగా తీసుకోవద్దని లైఫ్ తో ఆటలు ఆడవద్దని రష్మీ తెలిపారు. కరోనా సోకకుండా నియమనిబంధనలు పాటించాలని రష్మీ వెల్లడించారు. వైరస్ బారిన పడకుండా మాస్కులు ధరించడంతో పాటు శానిటైజర్లను తప్పనిసరిగా వినియోగించాలని రష్మీ తెలిపారు.

కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రభుత్వం విధించే రూల్స్ గా చూసినన్ని రోజులు కరోనా ఇదే విధంగా ఉంటుందని రష్మీ పేర్కొన్నారు. కరోనా విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని ముందుకు వస్తే మాత్రమే వైరస్ కు చెక్ పెట్టడం సాధ్యమవుతుందని రష్మీ తెలిపారు. రష్మీ సెటైరికల్ గా కరోనా విషయంలో చేసిన సూచనలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. రష్మీ చేసిన ఎమోషనల్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus