Anchor Rashmi: జబర్దస్త్ నుంచి రష్మి తప్పుకోవడానికి అదే కారణమా?

  • October 5, 2023 / 06:48 PM IST

బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారమవుతున్నప్పటికీ జబర్దస్త్ కార్యక్రమానికి మాత్రం విపరీతమైనటువంటి ఫాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. ఈటీవీలో గురు శుక్రవారాలలో ప్రసారం అవుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కంటెస్టెంట్లు కూడా ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకొని ప్రస్తుతం సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ప్రతి గురువారం జబర్దస్త్ కార్యక్రమం ప్రసారం కాగా శుక్రవారం ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమం ప్రసారమవుతుంది అయితే ఈ కార్యక్రమానికి యాంకర్ రష్మీ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు.

జబర్దస్త్ కార్యక్రమానికి అనసూయ యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకుని సినిమా అవకాశాలు అందుకున్నారు. దీంతో ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో సౌమ్యరావు యాంకర్ గా స్థిరపడ్డారు. ఇక ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి రష్మీ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు అయితే తాజాగా ఈ కార్యక్రమం నుంచి కూడా ఈమె తప్పుకోబోతున్నారనీ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే ఈమె ఎందుకు ఈ కార్యక్రమం నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నారు అనే విషయాన్నికి వస్తే ఈ షోకి కాస్త రేటింగ్ కూడా తగ్గడంతో మల్లెమాలవారు రెమ్యూనరేషన్ విషయంలో భారీగా కోతలు విధించారట. ఇలా ఒకప్పుడు అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ చెల్లించే మల్లెమాల వారు ఇప్పుడు రెమ్యునరేషన్ విషయంలో భారీగా కోత విధించడంతో ఈమె కూడా ఈ కార్యక్రమం నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఇలా ఈ షో ద్వారాఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి (Anchor Rashmi) రష్మీ ఇతర చానల్స్ లో సరికొత్త కార్యక్రమాల ద్వారా రావడానికి సిద్ధమయ్యారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.మరి నిజంగానే ఈమె కూడా అనసూయ బాటలోనే ఈటీవీకి గుడ్ బై చెప్పబోతున్నారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus