సినీ పరిశ్రమలో మరో విషాదం.. ‘మీర్జాపూర్’ నటుడు అనుమానాస్పద మృతి..!

  • December 2, 2021 / 06:39 PM IST

ఈ మధ్య కాలంలో వరుసగా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు మృతి చెందుతుండడం.. అందరినీ ఆందోళనకి గురిచేస్తుంది. గత వారం రోజుల్లో శివ శంకర్ మాస్టర్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి వంటి వారు మరణించారు. ఇప్పుడు మరో స్టార్ నటుడు మరణించడం కలవరపరిచే విషయం. వివరాల్లోకి వెళితే… ప్రముఖ బాలీవుడ్ నటుడు బ్రహ్మ మిశ్రా అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ముంబైలో వెర్సోవాలోని అపార్ట్మెంట్లో ఉన్న తన ప్లాట్లో మిశ్రా శవమై ఉండడాన్ని స్థానికులు గుర్తించారు.

కుళ్లిపోతున్న స్థితిలో అతని శవం ఉండడం గమనార్హం. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ శవాన్ని పోస్ట్ మార్టం కొరకు డా.కూపర్‌ హాస్పిటల్ కు పంపారు. మిశ్రా ఒంటి పై గాయాలు అయినట్టు ఆనమాలను పోలీసులు గుర్తించడం జరిగింది. అందుకే పోస్ట్ మార్టంకి పంపినట్టు బాలీవుడ్ మీడియా వర్గాల నుండీ సమాచారం. మిశ్రాది హత్యనా? లేక ఆత్మహత్యా? అన్న వివరాలు తెలియాల్సి ఉండగా… అతని సన్నిహితులు మాత్రం అతనికి శత్రువులు ఎవరు లేరు అని చెబుతున్నారు.

ఇప్పటివరకు అతను ఎవ్వరికీ ఏ కీడు కలగజేయలేదు అని కూడా ఎమోషనల్ అవుతున్నారు. కాగా బ్రహ్మ మిశ్రా బాలీవుడ్ సూపర్ హిట్ వెబ్ సిరీస్ అయిన ‘మీర్జాపూర్‌’ లో మున్నా త్రిపాఠి ఫ్రెండ్ లలిత్‌ పాత్రతో నటించాడు. ‘మీర్జాపూర్‌2’ తో పాటు ‘మంజి: ద మౌంటెన్‌ మ్యాన్‌’, ‘కేసరి’ సహా పలు చిత్రాల్లో కూడా నటించాడు

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
ప్రిన్స్ టు రవి.. ‘బిగ్ బాస్’ లో జరిగిన 10 షాకింగ్ ఎలిమినేషన్స్..!
చిరు, కమల్ మాత్రమే కాదు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ప్లాపైన స్టార్స్ లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus