ఆ మర్డర్ మిస్టరీ సినిమాను రీమేక్ చేస్తారట

  • October 7, 2018 / 03:55 AM IST

పరాయి భాషలో మంచి విజయం సొంతం చేసుకొన్న లేదా క్రిటికల్ గా ఎక్లైమ్ సంపాదించుకొన్న చిత్రాలను తెలుగులో రీమేక్ లేదా డబ్బింగ్ రూపంలో తెలుగులో విడుదలవ్వడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయం. మొన్న విడుదలైన “96” అనే లవ్లీ ఫిలిమ్ ను దిల్ రాజు తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాతోపాటు విడుదలైన మరో తమిళ చిత్రం “రాత్సశన్”ను కూడా తెలుగులో రీమేక్ చేయాలనుకొంటున్నారని టాక్. తమిళ యువ కథానాయకుడు విష్ణు విశాల్-అమలాపాల్ హీరోహీరోయిన్లుగా తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం నిన్న విడుదలై క్రిటిక్స్ నుంచి, ఆడియన్స్ నుంచి కూడా విశేషమైన రెస్పాన్స్ అందుకొంది.

మర్డర్ మిస్టరీగా తెరకెక్కిన ఈ చిత్రం సబ్జెక్ట్ కి యూనివర్సెల్ అప్పీల్ ఉందని గ్రహించిన తెలుగు దర్శకనిర్మాతలు కొందరు ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని ఫిక్స్ అయ్యి.. ఆల్రెడీ రీమేక్ రైట్స్ కొనేందుకు టాక్స్ కూడా జరుగుతున్నాయట. మరి ఎవరు ఈ సినిమా హక్కులు సొంతం చేసుకొంటారో తెలియదు కానీ.. ఓ పాపులర్ యంగ్ హీరో ఈ సినిమాలో నటించేందుకు ఉవ్విళ్లూరుతున్నాడని వినికిడి. మరి ఈ మర్డర్ మిస్టరీ తెలుగులో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus