తెలుగు ప్రజల ఆదరణకు ఫిదా అయిన అనుపమ పరమేశ్వరన్

  • April 11, 2018 / 12:56 PM IST

మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) మలయాళ చిత్రం ప్రేమమ్ మూవీతో యువకుల హృదయాలను గెలుచుకుంది. తెలుగు ప్రేమమ్ లోను సుమ గా ఆకట్టుకుంది. అంతకంటే ముందే అ.. ఆ సినిమాలో సొంతగా డబ్బింగ్ చెప్పుకుని మరీ మెప్పించింది. శతమానం భవతి చిత్రంలో శర్వానంద్ తో జోడీగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. రీసెంట్ గా ఉన్నదీ ఒక్కటే జిందగీ లోను పక్కింటి అమ్మాయిలా నటించి అభిమానులను పెంచేసుకుంది. అంతేకాదు తనని ఆదరిస్తున్న తెలుగు ప్రజలను చూసి టాలీవుడ్ పై ప్రేమ పెంచుకుంది. అందుకే మలయాళం నుంచి అనుపమకు ఆఫర్లు వస్తున్నప్పటికీ సున్నితంగా తిరస్కరిస్తోందంట.

తెలుగు కథలకే ప్రాముఖ్యత ఇస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం అనుపమ కృషార్జున యుద్ధంలో నానికి జోడీగా నటించింది. ఈ సినిమా రేపు రిలీజ్ కానుంది. ఈ సినిమా తో పాటు కరుణాకరన్ దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ చేస్తున్న చిత్రంలోనూ అనుపమ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో అనుపమది హీరోని డామినేట్ చేసే పాత్ర అని సమాచారం. ఈ రెండు సినిమాలు విజయవంతమైతే మరిన్ని అవకాశాలు అనుపమ చేతిలోకి వస్తాయి. భవిషత్యులో మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ సరసన నటించే అవకాశం అందుకుంటుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus