Anchor Pradeep: ఏపీ రాజధానిపై యాంకర్ కామెంట్స్!

Ad not loaded.

బుల్లితెరపై యాంకర్ ప్రదీప్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన్ని అభిమానించేవారు లక్షల్లో ఉన్నారు. తన కామెడీ టైమింగ్, పంచ్ లతో అందరినీ నవ్విస్తుంటారు. గతంలో కొన్ని సార్లు వివాదంలో ఇరుక్కోవడంతో ఆచితూచి మాట్లాడుతుంటారు ప్రదీప్. అయితే తాజాగా మరోసారి ఆయన చేసిన కామెంట్స్ వివాదానికి దారి తీశాయి. ఓ షోలో యాంకర్ ప్రదీప్ ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి చేసిన వ్యాఖ్యలపై కొందరు వివాదం సృష్టిస్తున్నారు. ఇటీవల హైపర్ ఆది తెలంగాణపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో ఇరుక్కున్నారు.

ఈ వివాదం ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతుందనుకుంటే ఇంతలో యాంకర్ ప్రదీప్ ఏపీ రాజధానిపై కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. ఏపీ రాజధాని విశాఖ అని ప్రదీప్ కామెంట్ చేయడం వివాదానికి దారి తీసింది. ప్రదీప్ చేసిన ఈ కామెంట్ పై ఏపీ పరిరక్షణ సమితి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తన వ్యాఖ్యలు ప్రదీప్ ఉపసంహరించుకోవడంతో పాటు క్షమాపణలు చెప్పాలి ఆ సంస్థ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ క్షమాపణలు చెప్పకుంటే హైదరాబాద్ లో ప్రదీప్ ఇంటిని ముట్టడిస్తామని సదరు సంస్థ హెచ్చరించింది.

కోర్టులో ఉన్న అంశాల గురించి ప్రదీప్ ఎలా మాట్లాడతారని సంస్థ ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం రాజధాని విశాఖ అంటే తప్పేంటని అడుగుతున్నారు. మరి ఈ విషయంలో ప్రదీప్ క్షమాపణలు చెబుతారేమో చూడాలి!

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus