ఈనెలలో థియేటర్లలో సందడి చేయనున్న తెలుగు చిత్రాలు

  • August 3, 2017 / 08:31 AM IST

తెలుగు చిత్ర పరిశ్రమకు 2017 సంవత్సరం మంచి విజయాలను అందించింది. ఆ ఉత్సాహంతో అనేక చిత్రాలు వేగంగా పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. ఈ నెలలో అనేక చిన్న చిత్రాలు థియేటర్లో సందడి చేయడానికి ముస్తాబయ్యాయి. క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా నటించిన నక్షత్రం, సుకుమార్ నిర్మాణంలో రూపొందిన “దర్శకుడు” చిత్రాలు ఆగస్ట్ 4న విడుదల కానున్నాయి. ఈ వార్ తర్వాత రెండో వారంలో పెద్ద పోరు జరగనుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన “లై”, రానాతో తేజ తీసిన నేనే రాజు నేనే మంత్రి ఆగస్ట్ 11 న విడుదల కానున్నాయి.

ఈ రెండు సినిమాలతో పోటీ పడేందుకు వీటికంటే ఒకరోజు ముందే అంటే ఆగస్టు 10 న  బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన జయ జానకి నాయక  రిలీజ్ కాబోతోంది. ఆ తర్వాతి వారం అంటే ఆగస్ట్ 18న తాప్సీ నటించిన ఆనందో బ్రహ్మ, సునీల్ హీరోగా క్రాంతి మాధవ్ తెరకెక్కించిన ఉంగరాల రాంబాబు థియేటర్లోకి రానున్నాయి. ఆగస్ట్ 24న నాగ చైతన్య నటించిన యుద్ధం శరణం, ఆగస్ట్ 25న  విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి, అల్లరి నరేష్ మూవీ “మేడ మీద అబ్బాయి” విడుదల అవుతున్నాయి.  ఇలా యువ హీరోల సినిమాలతో ఆగస్టు నెల కళకళలాడనుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus