Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

Advertisement

రాజశేఖర్ గారి కెరీర్‌లో భారీ విజయం సాధించిన చిత్రాల్లో ‘మా అన్నయ్య’ ఒకటి. ఇటు మాస్ పల్స్, అటు ఫ్యామిలీ ఎమోషన్స్‌ను సమపాళ్ళలో పండించిన ఈ సినిమా ఇప్పటికీ టీవీల్లో వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ టీవీలకు అతుక్కుపోతారు. అయితే, ఈ సినిమా రీమేక్ రైట్స్ వెనుక ఆసక్తికరమైన కథ ఉంది.

Maa Annayya

తమిళంలో విజయకాంత్ నటించిన ‘వానత్తై పోల’ చిత్రానికి ఇది రీమేక్. ఆ రోజుల్లో ఈ సినిమా రైట్స్ కోసం టాలీవుడ్ స్టార్ హీరోలు, ప్రముఖ నిర్మాతలు పోటీ పడ్డారు. ఒరిజినల్ నిర్మాత 75 లక్షల రూపాయలు డిమాండ్ చేయగా, చాలామంది 70 లక్షల వరకు వచ్చి వెనక్కి తగ్గారు.

కానీ, రాజశేఖర్ గారు ఆ సినిమాను మూడుసార్లు చూసి, దానిపై ఉన్న నమ్మకంతో నిర్మాత అడిగిన 75 లక్షలకు ఓకే చెప్పారు. ఆ తర్వాత నిర్మాత బెల్లంకొండ సురేష్ ఆ సినిమాను రాజశేఖర్ దగ్గర నుంచి కొనుగోలు చేసి నిర్మాణం స్టార్ట్ చేశారు. ఫలితంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి రాజశేఖర్ గారి కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచింది.
రాజశేఖర్ గారు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమాలో పెద్ద అన్నయ్య పాత్ర తన తండ్రిని పోలి ఉంటుందని చెప్పారు. నిజ జీవితంలో తాను ఇద్దరు తమ్ముళ్లకు అన్నయ్యను అని చెప్పారు.

ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ విషయంలో ఆయన చూపిన పట్టుదల, ఆయన నిర్ణయం ఎంత సరైనదో కాలం నిరూపించింది. ఎందుకంటే థియేటర్లో ఇప్పటికీ మీద విజయం సాధిస్తూనే ఉంది. ఇక యూట్యూబ్ లో ఈ సినిమా కామెడీ సీన్స్, ఎమోషనల్ సీన్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక ప్రస్తుత సినిమాల విషయానికొస్తేఇటీవల బైకర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు రాజశేఖర్. శర్వానంద్ హీరోగా నటించిన ఆ సినిమాలో కథానాయకుడి తండ్రి పాత్రలో ఆయన కనిపించారు.

కొత్త సినిమా విషయానికొస్తే… తమిళ హిట్ చిత్రం ‘లబ్బర్ పందు’ రీమేక్ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల ఓ సినిమా షూటింగ్లో భాగంగా ఆయన గాయపడటంతో రీమేక్ సినిమా షూటింగ్ కి అవాంతరాలు కలిగాయి. త్వరలో ఈ సినిమా షూటింగ్ పునర్ ప్రారంభిస్తారని సమాచారం.

రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus