Pooja Hegde: నాతో అతను మొరటుగా ప్రవర్తించాడు: పూజా హెగ్డే

  • June 9, 2022 / 06:29 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కి ఘోర అవమానం ఎదురైంది. ఇండిగో విమాన సిబ్బంది ఆమెతో అసభ్యంగా ప్రవర్తించిందంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. విషయంలోకి వెళ్తే.. “ఇండిగో స్టాఫ్ లో విపుల్ నకాషే అనే వ్యక్తి ఈ రోజు ముంబై నుండీ బయలుదేరిన మా ఫ్లైట్ లో నాతో అనుచితంగా ప్రవర్తించాడు. ఎలాంటి కారణం లేకుండా మా పై పూర్తిగా అహంకారం, అజ్ఞానం, బెదిరింపు టోన్‌లో మాట్లాడి మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు.

సాధారణంగా ఇలాంటి విషయాల గురించి నేను ట్వీట్ చేయను. కాకపోతే ఈ సంఘటన నన్ను చాలా బాధ పెట్టింది..’ అంటూ పేర్కొంది బుట్టబొమ్మ. పూజా హెగ్డే చేసిన ట్వీట్ పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. ఆమె అభిమానులు ఇండిగో ఎయిర్‌లైన్స్ పై మండి పడుతూ కామెంట్లు చేశారు.దీంతో ఇండిగో ఎయిర్ లైన్స్ స్పందించి… మన పూజా హెగ్డే కి క్షమాపణలు చెప్పింది. అంతేకాకుండా ఈ విషయం పై వెంటనే చర్యలు తీసుకుంటామని..

దయచేసి పిఎన్ఆర్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్ మెసేజ్ చేయాలని రాసుకొచ్చింది. ప్రైవేట్ గా మెసేజ్ పెట్టమని ఓ లింక్ కూడా ఈ సంస్థ పెట్టింది. అయితే ‘సెలబ్రిటీలు చిన్న చిన్న విషయాలకు కూడా ఇలాంటి ట్వీట్లు వేసి సింపతీ గెయిన్ చేస్తారు, దయచేసి ఆ ఎంప్లాయ్ ఉద్యోగం పోయేలా ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దని’ మరికొందరు ఇండిగో సంస్థ కి విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పూజా హెగ్డే హిందీలో సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా చేస్తుంది. అలాగే తెలుగులో విజయ్ దేవరకొండతో ‘జన గణ మన’,పవన్ కళ్యాణ్ తో ‘భవదీయుడు భగత్ సింగ్’ చిత్రాలతో పాటు మహేష్ బాబు- త్రివిక్రమ్.. కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా నటిస్తుంది.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus