బాహుబలి చిత్ర బృందంతో అమర్యాదకరంగా ప్రవర్తించిన ఎయిర్ లైన్స్ సిబ్బంది

  • April 26, 2017 / 12:10 PM IST

ప్రపంచంలో ఎక్కడకు పోయినా ఘన స్వాగతం అందుకుంటున్న బాహుబలి చిత్ర బృందానికి చేదు అనుభవం ఎదురైంది. బాహుబలి కంక్లూజన్ చిత్ర ప్రమోషన్లో భాగంగా  ప్రభాస్, అనుష్క, రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ తదితరులు దుబాయ్ వెళ్లారు. అక్కడ కార్యక్రమం అనంతరం వీరంతా  ఈరోజు దుబాయ్ నుంచి హైదరాబాద్ కి ఎమిరేట్స్ విమానంలో బయలుదేరారు. వారంతా ఎయిర్ పోర్ట్ గేట్ వద్దకు చేరుకోగానే విమాన సిబ్బంది చిత్రబృందంతో అమర్యాదకరంగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని బాహుబలి నిర్మాతలో ఒకరైన శోభు యార్లగడ్డ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘ఎమిరేట్స్ ఈకే526 విమానంలో హైదరాబాద్ బయలుదేరాం.

B4 గేట్ వద్ద ఎయిర్ లైన్స్ సిబ్బంది మాతో అమర్యాదకరంగా ప్రవర్తించారు. అందులో ఓ సిబ్బంది మాపై జాతివివక్ష వ్యాఖ్యలు చేసినట్లు అనిపించింది. నేను తరచూ ఎమిరేట్స్ విమానంలో ప్రయాణిస్తుంటాను కానీ ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో అతిపెద్ద ప్రాజక్ట్ ని నడిపించిన శోభు ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దీనిపై  ఎయిర్ లైన్స్ ఇంకా స్పందించలేదు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus