ప్రభాస్ సాహో సినిమాని సొంతం చేసుకునేందుకు భారీ డీల్

  • May 19, 2017 / 05:59 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత చేస్తున్న సినిమా సాహో. యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ గత నెల విడుదలై అంచనాలను పెంచేసింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు 150 కోట్లతో ఏకకాలంలో మూడు భాషల్లో నిర్మించనున్నారు. ప్రస్తుతం విదేశీ టూర్ లో ఉన్న ప్రభాస్ ఇండియాకి తిరిగిరాగానే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. అయితే సాహో ప్రొడక్షన్ వర్క్ కూడా ఊపందుకోకముందే ఈ మూవీని కొనుగోలు చేయడానికి పెద్ద సంస్థలు ముందుకు వస్తున్నాయి. రీసెంట్ గా ఓ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వారు సాహో థియేటర్ హక్కులు (దేశం మొత్తం) కోసం 350 ఇస్తామని నిర్మాతలను సంప్రదించారు. అయితే ఇప్పుడే బిజినెస్ జోలికి వెళ్లడం ఇష్టం లేక తిరస్కరించినట్లు తెలుస్తోంది.

ఈ క్రేజ్ చూస్తుంటే బాహుబలి కంక్లూజన్ మాదిరిగా సాహో కూడా 500 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయనుంది. బాలీవుడ్, టాలీవుడ్ టెక్నీషన్లు పనిచేస్తున్న ఈ సినిమా ఎక్కువ భాగం దుబాయ్ లో షూటింగ్ జరుపుకోనుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus