Avantika: బెల్లంకొండతో భాగ్యశ్రీ కూతురు రొమాన్స్!

  • November 12, 2021 / 02:35 PM IST

‘రాధేశ్యామ్’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది ఒకప్పటి నటి భాగ్యశ్రీ. దశాబ్దాల క్రితం వచ్చిన ‘ప్రేమ పావురాలు’ అనే సినిమాతో తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఈ నటి.. ఆ తరువాత టాలీవుడ్ పై పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఇప్పుడు ‘రాధేశ్యామ్’లో ప్రభాస్ కు తల్లిగా నటిస్తోంది. గతంలో తను చేసినట్లుగా కాకుండా.. తన కూతురుని ముందుగా టాలీవుడ్ కి పరిచయం చేస్తుంది. భాగ్యశ్రీ కూతురు అవంతిక.. టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమవుతోంది.

బెల్లంకొండ గణేష్ హీరోగా నటిస్తోన్న ఓ సినిమాలో అవంతికను హీరోయిన్ గా తీసుకున్నారు. ‘నాంది’ సినిమాను నిర్మించిన సతీష్ వేగ్నేశ ఈ సినిమాను కూడా నిర్మించబోతున్నారు. చూడడానికి తన తల్లిలా ఉండే అవంతిక.. బెల్లంకొండ సినిమాకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. స్వయంగా భాగ్యశ్రీ కథ విని ఈ ప్రాజెక్ట్ ను ఓకే చేశారు. అలా అటు ‘రాధేశ్యామ్’తో భాగ్యశ్రీ.. ఇటు బెల్లంకొండ గణేష్ సినిమాతో అవంతిక.. ఇద్దరూ ఒకే సీజన్ లో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు.

గతంలో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్ లో ఫేమస్ అయిన తారలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అవంతిక కూడా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి.. బాలీవుడ్ లో బిజీ అవుతుందేమో చూడాలి!

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus