భరత్ అనే నేను ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా ఎన్టీఆర్

  • April 3, 2018 / 10:35 AM IST

ఏప్రిల్ 7న హైద్రాబాద్ లో భారీ స్థాయిలో ‘భరత్ అనే నేను‘ ఆడియో విడుదల వేడుక జరగనున్న విషయం తెలిసిందే. ఎల్బీ స్టేడియంలో జరగనున్న ఈ భారీ బహిరంగ సభకు ఎన్టీఆర్, రామ్ చరణ్ ముఖ్య అతిధులుగా విచ్చేయనున్న విషయం తెలిసిందే. అందుకే.. “రంగస్థలం” సక్సెస్ సెలబ్రేషన్స్ కి వెళ్ళిన నమ్రత కాస్ట్లీ షాంపైన్ బోటల్ ను గిఫ్ట్ గా ఇచ్చి మరీ రామ్ చరణ్ ను “భరత్ అనే నేను” ఆడియో రిలీజ్ కి చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేసింది. స్వయంగా నమ్రత వచ్చి అడగడంతోపాటు తన తదుపరి రెండు చిత్రాల నిర్మాత అయిన డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడంతో తప్పక వస్తానని ప్రామిస్ చేశాడు చెర్రీ.

మరి ఎన్టీయార్ కి ఇంకా ఇన్విటేషన్ ఇవ్వలేదేంటి అని నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే.. ఎన్టీయార్ ను పర్సనల్ గా ఇంటికి వెళ్ళి మరీ ఇన్వైట్ చేయనున్నాడట మహేష్ బాబు. సాక్ష్యాత్తు మహేష్ బాబు వచ్చి అడిగితే ఎన్టీయార్ కాదంటాడా చెప్పండి. సో, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ నందమూరి తారకరామారావు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లను ఒకే వేదికపై చూడాలన్న ముగ్గురు కుటుంబసభ్యుల అభిమానుల ఆశ “భరత్ అనే నేను” ఆడియో విడుదల వేడుకలో తీరనున్నదన్నమాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus