విశాఖపట్నంలో మహేష్ బాబు ఈవెంట్

  • March 17, 2018 / 12:04 PM IST

మహేష్ బాబు తాజా చిత్రమైన ‘భరత్ అనే నేను’ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 20న విడుదలకు సిద్ధమవుతుండగా.. సినిమా ప్రమోషన్స్ ఊపందుకొన్నాయి. ఆన్ లైన్ లో మ్యూజికల్ సింగిల్స్ రిలీజ్ అనంతరం భారీ స్థాయిలో ప్రీరిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 7న ఈ భారీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను విశాఖపట్నంలో ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు కెరీర్ లో విశాఖపట్నంలో జరగబోయే మొట్టమొదటి ఈవెంట్ ఇదే కావడంతో వైజాగ్ అభిమానులందరూ ఇప్పట్నుంచి తమ సూపర్ స్టార్ ను విశాఖపట్నంలో చూసుకొనేందుకు సన్నద్ధమవుతున్నారు.

మహేష్ బాబు సరసన కైరా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకుడు కాగా.. దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆల్రెడీ విడుదలైన ఆడియో టీజర్, పోస్టర్స్ మరియు టీజర్ సినిమా మీద అంచనాలను విపరీతంగా పెంచేశాయి. ముఖ్యంగా “బ్రహ్మోత్సవం, స్పైడర్” వంటి డిజాస్టర్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మహేష్ బాబు మాత్రమే కాదు ఆయన అభిమానులు కూడా భారీ ఆశలు పెట్టుకొన్నాడు. అందుకే “భరత్ అనే నేను” సినిమా ప్రమోషన్స్ ను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus