బాలీవుడ్ నటుడిని ఢీ కొట్టనున్న నాని!

  • February 5, 2018 / 05:59 AM IST

నేచురల్ స్టార్ నాని హీరోగా, నిర్మాతగా చాలా బిజీగా ఉన్నారు. వరుసగా విజయాలను అందుకంటున్న ఈ యువ హీరో ఎంసీఏ తర్వాత  మేర్లపాక గాంధీ దర్శకత్వంలో “కృషార్జున యుద్ధం” సినిమా చేస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రంలో నాని డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. హీరో అతనే.. విలన్ అతనే అని రూమర్లు కొంతకాలంగా షికారు చేశాయి. అయితే అది నిజం కాదని చిత్ర బృందం స్పష్టం చేసింది. ఈ చిత్రంలో విలన్ గా బాలీవుడ్ మోడల్, నటుడు రవి అవన్ నటిస్తున్నాడు. ఇతను పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన “ఇజం” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

ఆ చిత్రంలో పెద్దగా గుర్తింపు సాధించలేకపోయారు. అయితే “కృషార్జున యుద్ధం” సినిమాలో రవి అవన్  డ్రామా, ఎమోషన్ బాగా పలికించారని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ మూవీ అతనికి మంచి పేరు తెస్తుందని వెల్లడించింది. అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ మీర్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి హిప్ హాఫ్ తమీజా సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ లుక్స్ తో ఆసక్తి కలిగించిన “కృషార్జున యుద్ధం”  ఏప్రిల్ నెలలో రిలీజ్ కానుంది. దీని తర్వాత నాని నాగార్జునతో కలిసి మల్టీ స్టారర్ మూవీ చేయనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus