బోయపాటి టెన్షన్ కి కారణం చిరంజీవా ?

  • June 24, 2017 / 05:44 AM IST

మాస్ డైరక్టర్ బోయపాటి శ్రీను గీతా ఆర్ట్స్ బ్యానర్లో సరైనోడు వంటి బ్లాక్ బస్టర్ మూవీ చేశారు. దీంతో అదే బ్యానర్లోనే మరో సినిమా చేయాలనీ అనుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా తన 151 వ సినిమాని బోయపాటి దర్శకత్వంలో చేద్దామని మంచి స్టోరీ రెడీ చేయమని స్వయంగా ఫోన్ చేసి చెప్పారు. ఆ కథ ప్రిపేర్ లో ఉండగానే చిరు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలా వాడ నరసింహా రెడ్డి సినిమా ప్రకటించారు. దీంతో బోయపాటి మరో సినిమాకి కమిట్ అయ్యారు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ‘జయ జానకి నాయక’ అనే సినిమాని మొదలెట్టారు. దీని తర్వాత బాలయ్య 103 వ మూవీ డైరక్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇలా తన పది నెలల షెడ్యూల్ ని ప్లాన్ చేసుకున్న బోయపాటిని చిరు టెన్షన్ లో పడేశారు.

రెండు రోజుల క్రితం చిరు ఫోన్ చేసి తన స్క్రిప్ట్ పట్టుకురమ్మని ఫోన్ చేసాడంటా. దీంతో బోయపాటి షాక్ తిన్నాడు.  చిరంజీవి తన 151 సినిమా ప్రకటించగానే అది పూర్తి అవడానికి ఏడాది పడుతుందని.. తాను రాసే స్టోరీని పక్కన పడేసారు. ఇప్పుడు సడన్ గా అడిగేసరికి ఆందోళన పడుతున్నారు. ‘జయ జానకి నాయక’ సినిమా షూటింగ్ ని వాయిదా వేసి, చిరు సినిమాని కంప్లీట్ చేయాలా?. చిరుతో అవకాశాన్ని వదులుకోవాలా? అనే బోయపాటి పడిపోయారు. మరి ఈ డైరక్టర్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus