బన్నీ, బోయపాటి ఒకేసారి మొదలెట్టారే..!

  • November 5, 2016 / 10:54 AM IST

అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన ‘సరైనోడు’ మాస్ జనాలను మెప్పించి హిట్ కొట్టింది. ఆ సినిమా విడుదలై ఆరు నెలలు కావస్తున్నా ఇద్దరూ తమ తర్వాతి సినిమాల జోలికి పోనే లేదు. అలాంటిది యాదృచ్చికంగా ఈ ఇద్దరూ నిన్ననే తమ సినిమాల పనులను ఆరంభించడం విశేషం.సినిమా సినిమాకి పైకెదగాలని తపిస్తున్న బన్నీ ‘సరైనోడు’ పూర్తైన చాలాకాలం వరకు కథలు వింటూనే కాలం గడిపేశాడు. ఎట్టకేలకు రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ అల్లువారి పిల్లగాడు తొలుత హరీష్ శంకర్ సిద్ధం చేసిన ‘దువ్వాడ జగన్నాధం’ సినిమాని మొదలెట్టాడు. ఈ సినిమా పూజ కార్యక్రమాలు ఆ మధ్య జరిగినా సినిమా సెట్స్ మీదికెళ్లింది నిన్నట్నుంచే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఇక బోయపాటి విషయానికొస్తే.. ‘సరైనోడు’ ఒప్పుకునే సమయానికే బెల్లంకొండ-బోయపాటిల మధ్య చర్చలు జరిగాయి. వాటి ఫలితంగా బెల్లకొండ శ్రీనివాస్ తో బోయపాటి సినిమా అన్న వార్త బయటికొచ్చింది. అయితే ఆ సినిమా పట్టాలెక్కేందుకు మాత్రం ఆరు మాసాల సమయం పట్టింది. ఈ గ్యాప్ ఎలా వచ్చిందో కానీ ఒకానొక దశలో ఈ సినిమా అట్టాగెక్కిందన్న ప్రచారం జరిగింది. అయితే అభిషేక్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందాల్సిన ఈ సినిమా కాస్త ద్వారక క్రియేషన్స్ సంస్థల్లోకి వెళ్ళింది. నిన్న పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 16 నుండి జరుగనుంది. ‘సరైనోడు’ సినిమాకి ఛాయాగ్రహణం సమకూర్చిన రిషి పంజాబీ ఈ సినిమాతో వరుసగా రెండోసారి బోయపాటి సినిమాకి పనిచేస్తుండగా దేవి శ్రీ కూడా శ్రీనివాస్ సినిమాకి రెండోసారి సంగీతం అందిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus