‘ఉప్పెన’ ఆ రేర్ ఫీట్ ను కూడా సాధిస్తుందా..!

  • February 15, 2021 / 05:58 PM IST

ఫిబ్రవరి 12న విడుదలైన ‘ఉప్పెన’ చిత్రం 3 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.28కోట్ల వరకూ షేర్ ను రాబట్టింది. డెబ్యూ హీరోల్లో అత్యథిక కలెక్షన్లను రాబట్టిన హీరోగా ఇప్పటి వరకూ చరణ్ ఉండగా.. ‘ఉప్పెన’ తో దాన్ని బ్రేక్ చేసి తన పేరు రాసుకున్నాడు వైష్ణవ్ తేజ్. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. వీళ్ళిద్దరూ మొదటి నుండీ సినిమా పై అంచనాలు పెరగడంలో కీలక పాత్ర పోషించారనే చెప్పాలి.

‘నీ కన్ను నీలి సముద్రం’ అనే పాటతో దేవి, అలాగే తన లుక్స్ మరియు ట్రైలర్ లో క్యూట్ ఎక్స్ప్రెషన్లతో కృతి.. సినిమా పై అంచనాలు భారీగా పెంచేశారనే చెప్పాలి. అంతేకాకుండా థియేటర్లలో 100శాతం ఆకుపెన్సీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం కూడా ఈ భారీ ఓపెనింగ్స్ కు కారణమయ్యిందనే చెప్పాలి..! ఇదిలా ఉండగా.. వీకెండ్ మొత్తం ఈ చిత్రం బాగానే క్యాష్ చేసుకుంది.. అయితే సోమవారం నుండీ ఎలాంటి కలెక్షన్లు నమోదవుతాయి అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.

అందులోనూ ఈ సినిమా పై కొంత మిక్స్డ్ టాక్ కూడా వచ్చింది.అయినప్పటికీ ఫిబ్రవరి వంటి డ్రై సీజన్లో భారీ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. కానీ ఇప్పటి వరకూ ఫిబ్రవరి నెలలో అత్యథిక కలెక్షన్లను రాబట్టిన చిత్రంగా ప్రభాస్ ‘మిర్చి’ ఉంది. ఆ చిత్రం ఫుల్ రన్లో రూ.48కోట్ల పైనే షేర్ ను వసూల్ చేసింది. అది కూడా టికెట్ ధర రూ.55(సింగిల్ స్క్రీన్ లలో) ఉన్న రోజుల్లో..! మరి ఆ చిత్రం కలెక్షన్లను ‘ఉప్పెన’ అధిగమించి సరికొత్త రికార్డు సృష్టిస్తుందా.. అనేది చూడాలి..!

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus