అప్పుడు కుదరకపోవడంతో ఇప్పుడు ఇంకో అవకాశం..!

  • March 20, 2018 / 11:34 AM IST

తమిళంలో ఘన విజయం సొంతం చేసుకొన్న “బోగన్” చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేద్దామనుకొని రవితేజను హీరోగా సెలక్ట్ చేసి, కేతరీన్ ను హీరోయిన్ గా ఫైనల్ గా చేసి నల్లమలుపు బుజ్జి నిర్మాణంలో తెరకెక్కించాలని, ఈ చిత్రానికి శ్రీకారం చుట్టారు. దర్శకుడు మొదలుకొని లొకేషన్స్ వరకూ అన్నీ ఫిక్స్ అయిపోయిన తర్వాత తమిళంలో ప్రతినాయక పాత్ర పోషించిన అరవిందస్వామి తెలుగులో నటించడానికి ఒప్పుకోకపోవడంతో. ఆయన లేకపోతే రవితేజ చేయను అని చెప్పడంతో ఆ సినిమా రీమేక్ అర్ధాంతరంగా ఆగిపోయింది. దాంతో మెయిన్ హీరోయిన్ గా అవకాశం సొంతం చేసుకున్నానన్న ఆనందం కేతరీన్ కు ఎక్కువసేపు మిగలలేదు.

అయితే. కేతరీన్ ఆశలు గల్లంతు చేయడం ఇష్టం లేని రవితేజ తన తాజా చిత్రమైన “అమర్ అక్బర్ ఆంటోనీ”లో అవకాశమిచ్చినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ ఈ చిత్రంలో అను ఎమ్మాన్యుల్ ఒక కథానాయికగా నటిస్తుండగా మరో హీరోయిన్ గా కేతరీన్ ను తీసుకోవడం జరిగింది. ఈ చిత్రంలో రవితేజ త్రిపాత్రాభినయం చేస్తుండగా మరో హీరోయిన్ కి కూడా అవకాశం ఉందన్నమాట. మరి ఆ మూడో అవకాశాన్ని ఎవరు దక్కించుకొంటారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus