Chandra Sekhar Yeleti: తమిళ కుర్ర హీరోతో చంద్రశేఖర్‌ యేలేటి.. ఈసారైనా ప్రాజెక్ట్‌ పట్టాలెక్కుతుందా?

తెలుగు సినిమా గత 25 ఏళ్ల కాలంలో చూసిన క్రియేటివ్‌ దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి. 2003లో ఆయన తెరకెక్కించిన ‘ఐతే’. ఆ సినిమా తెలుగు సినిమా మీద క్రియేట్‌ చేసిన ఇంపాక్ట్‌ ఎలాంటిదో మీకు తెలిసే ఉంటుంది. ఆ సినిమానే కాదు.. ఆ తర్వాత ఆయన తెరకెక్కించిన సినిమాలు కూడా తన ప్రత్యేకతను చాటి చెప్పాయి. అయితే ఫలితాలు ఆశించిన రీతిలో రాలేదు. దీంతో ఆయన గత కొన్నేళ్లుగా అవుటాఫ్‌ ఫోకస్‌ అయిపోయారు.

Chandra Sekhar Yeleti

ఇప్పుడు అంటే ఐదేళ్ల తర్వాత చంద్ర శేఖర్‌ యేలేటి కొత్త సినిమాను స్టార్ట్‌ చేస్తున్నారు అని సమాచారం. 2021లో ‘చెక్‌’ సినిమా తీసి, అది విఫలమైన తర్వాత చంద్రశేఖర్‌ యేలేటి కొత్త సినిమా షురూ చేయలేదు. అదిగో, ఇదిగో అంటూ కొన్ని ప్రాజెక్టుల గురించి వినిపించినా అవేవీ ఓకే కాలేదు. ఇప్పుడు ఓ తమిళ హీరోతో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నారని సమాచారం. అతనే వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రదీప్‌ రంగనాథన్‌.

తెలుగులో పెద్ద సినిమాలు చేస్తున్న ఓ నిర్మాణ సంస్థ ఇటీవల ప్రదీప్‌ రంగనాథన్‌, చంద్రశేఖర్‌తో మాట్లాడిందట. అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఇద్దరూ ఓకే అనుకుంటే సినిమా పట్టాలెక్కించేస్తారట. ప్రస్తుతం ప్రదీప్‌ చేతిలో ‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’ అనే సినిమా ఒక్కటే ఉంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌ చేస్తారు. ఆ తర్వాత చంద్రశేఖర్‌ యేలేటి సినిమా ఉండొచ్చు అని అంటున్నారు.

‘ఐతే’ సినిమా తర్వాత ‘అనుకోకుండా ఒక రోజు’తో మంచి విజయం అందుకున్న చంద్రశేఖర్‌ యేలేటి.. ఆ తర్వాత తీసిన ‘ఒక్కడున్నాడు’, ‘ప్రయాణం’, ‘సాహసం’, ‘మనమంతా’, ‘చెక్‌’ సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. కానీ వసూళ్ల పరంగా ఆశించిన ఫలితాలు అయితే ఇవ్వలేదు. ఆయన ఐదేళ్ల గ్యాప్‌కు ఈ సినిమాల ఫలితాలే కారణం. చూద్దాం ఇప్పుడు ప్రదీప్‌ రంగనాథన్‌ సినిమా ఓకే అయితే మంచి విజయం దక్కుతుందేమో.

ఈ సంక్రాంతే కాదు.. మరో రెండు సంక్రాంతులూ నావే అంటున్న మెగాస్టార్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus