వేదాళం’ రీమేక్ కోసమే మెగాస్టార్ గుండు లుక్ ట్రయల్

  • September 24, 2020 / 01:24 PM IST

‘బాస్… గుండు బాస్’ అంటూ ‘శివాజీ’ సినిమాలో సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇరగదీశారు. ఒకవేళ తాను కూడా ఏదైనా సినిమాలో గుండులో కనిపిస్తే… ఆ సినిమాలో రజనీతో కంపేర్ చేస్తారేమోనని మెగాస్టార్ చిరంజీవి ఆలోచనలో పడ్డారు. ఇటీవల ‘అర్బన్ మాంక్’ అంటూ కంప్లీట్ గుండుతో చిరంజీవి ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేశారు. తరవాత ఆ లుక్‌లోకి ఎలా మారిందీ ఒక వీడియో చేసి విడుదల చేశారు. ఆ లుక్‌ను కొంతమంది ‘శివాజీ’లో రజనీ లుక్‌తో కంపేర్ చేశారు. బహుశా… అది చిరంజీవి దృష్టికి వెళ్ళిందేమో!

సినిమాలో ఆ లుక్ ట్రై చెయ్యడానికి ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. దీని తరవాత మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాళం’ రీమేక్ చెయ్యనున్నారు. దాని కోసమే గుండు బాస్ లుక్ ట్రై చేశారు. అయితే, ఆ లుక్‌ను ఇంకా ఫైనలైజ్ చెయ్యలేదని అన్నారు. సెకండాఫ్‌లో కనిపిస్తే ఎలా ఉంటుందని డిస్కషన్లు చేస్తున్నారు. ‘ఆచార్య’, ‘వేదాళం’ రీమేక్ కాకుండా వీవీ వినాయక్ దర్శకత్వంలో ‘లూసిఫర్’ రీమేక్ చెయ్యనున్నట్టు చిరంజీవి చెప్పారు.

మొదట సుజీత్ దర్శకత్వంలో ఆ సినిమా రీమేక్ చెయ్యాలని అనుకున్నప్పటికీ… అతడికి కొత్తగా పెళ్లి కావడంతో సినిమా మీద పూర్తిగా దృష్టి సారించలేనని చెప్పడంతో వీవీ వినాయక్ చేతికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించానని చిరంజీవి అన్నారు. ‘ఆచార్య’లో రామ్ చరణ్ యాక్ట్ చెయ్యనున్నట్టు ఆయన తెలిపారు. ఇక, థియేటర్లు నవంబర్ నెలలో ఓపెన్ అవుతాయని ఆశిస్తున్నట్టు చిరంజీవి చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది సంక్రాంతికి అంతా సర్దుకుంటుందని, పూర్వ వైభవం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus