ఓటీటీ అయిపోయింది… ఇప్పుడు 70ఎంఎం

  • December 15, 2020 / 02:50 PM IST

‘షూటౌట్ ఎట్‌ ఆలేరు’తో ఓటీటీలో నిర్మాతగా అడుగుపెట్టిన చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ఇప్పుడు సినిమా నిర్మాతగా మారబోతోందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ‘24 కిస్సెస్‌’, ‘పీఎస్‌వీ గరుడవేగ’, ‘ఎల్‌ 7’ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న అదిత్‌ అరుణ్‌ హీరోగా గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై ఓ సినిమా నిర్మించబోతున్నారట. దీనికి సుస్మిత, ఆమె భర్త విష్ణుప్రసాద్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తారు. ‘షిట్‌ హ్యాపెన్స్‌’ అనే అడల్ట్‌ కామెడీ సిరీస్‌తో ఆకట్టుకున్న ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తాడట.

ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా ప్రారంభమయ్యాయని సమాచారం. ఫీల్‌ గుడ్‌ డ్రామాగా తెరకెక్కున్న ఈ సినిమాలో హీరో పాత్ర పక్కింటి కుర్రాడిలా ఉంటుందంటున్నారు. కథ బాగా నచ్చడంతో సుస్మిత… ఫైనల్‌ వర్డ్‌ కోసం తండ్రి చిరంజీవి దగ్గర పెట్టిందట. ఆయన కూడా పచ్చజెండా ఊపడంతో సినిమా ఫైనల్‌ అయ్యిందని సమాచారం. ఆ తర్వాత సత్యానంద్‌ దగ్గరకు కథ తీసుకెళ్లడం, ఆయన మార్పులు చేసి ఇవ్వడం కూడా జరిగిపోయాయట.

అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఫిబ్రవరిలో సినిమా పట్టాలెక్కతుందంటున్నారు. ఇప్పటికే ఫ్యాషన్‌ డిజైనర్‌గా సినిమాల్లో తనేంటో నిరూపించుకున్న సుస్మిత నిర్మాతగా ఎంతగా రాణిస్తుందో చూడాలి. అన్నట్లు క్రిస్‌మస్‌ సందర్భంగా ‘షూట్‌ ఔట్‌…’ సిరీస్‌ జీ5లో ప్రసారం కానున్న విషయం తెలిసిందే.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus