Chiranjeevi : ‘మన శంకర వరప్రసాద్ గారు’ OTT లోకి వచ్చేస్తున్నారు..!

Advertisement

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, స్టార్ హీరోయిన్ నయనతార హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ మూవీ 2026 సంక్రాంతి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి అందరికి తెలిసిందే. ఈ మూవీ చూడటానికి చాలా ఏళ్ళ తరువాత పెద్ద వయసు వారు కూడా థియేటర్ల బాట పట్టారంటే, MSVPG ఏ రేంజ్లో హిట్ అయిందో అర్ధం చేసుకోవచ్చు. థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ చిత్రం ఇప్పుడు OTT రిలీజ్ కి రెడీ అవుతుందట. అయితే అది ఏ రోజున అనేది చూసేద్దామా..

Chiranjeevi

‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీకి సంబందించిన OTT హక్కులను ప్రముఖ సంస్థ జీ 5 దక్కించుకోగా, ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. అయితే జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ కేవలం నైజాం ఏరియాలోనే 30+ లక్షల మంది డైరెక్ట్ థియేటర్లలో సినిమా చూసారని చిత్ర యూనిట్ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ మధ్యలో ఒక రీజినల్ మూవీకి ఒక్క ఏరియాలోని ఇంత మంది రావటం మొదటి సారి అంట. కాగా ఈ చిత్రంలో చిరు నటనతో పాటు, భీమ్స్ సిసిరోలియో అందించిన మ్యూజిక్ సినిమాకే హైలైట్ గా నిలిచాయి. స్వయంగా చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత మరియు సాహు గారపాటి సంయుక్తంగా నిర్మించారు. విడుదలైన 15 రోజులలోనే 350+ కోట్ల కలెక్షన్లు రాబట్టింది ఈ చిత్రం.

Mahesh Babu: వారణాసి రిలీజ్ డేట్.. అక్కడ ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus