‘వేదలం’ రీమేక్.. తేడా వస్తే అంతే…!

  • August 9, 2020 / 01:50 PM IST

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ‘ఆచార్య’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చిరు నక్సలైట్ పాత్రలో కనిపించబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ఈ ‘ఆచార్య’ షూటింగ్ ఆగిపోయింది. తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే విషయం ఇంకా అంచనా వెయ్యలేని పరిస్ధితి. సరే ఈ విషయాన్ని పక్కన పెడితే..ఈ ఖాళీ టైం లో మెగాస్టార్ తన తరువాతి సినిమాలకు సంబంధించి ప్లాన్స్ వేసుకుంటున్నారు.

సుజీత్ తో ‘లూసిఫర్’ రీమేక్… అలాగే బాబీ తో ఓ సినిమా, మెహర్ రమేష్ తో ఓ సినిమా చెయ్యబోతున్నట్టు చిరు అనౌన్స్ చేసారు. ఇప్పటికే బాబీ సినిమా స్క్రిప్ట్ ఓకే అయిపోయినట్టు వినికిడి. ఇదిలా ఉండగా…సుజీత్ రెడీ చేసిన ‘లూసిఫర్’ రీమేక్ స్క్రిప్ట్ మెగాస్టార్ కు సంతృప్తిని ఇవ్వలేదు. అందుకే అతన్ని సున్నితంగా తప్పించి… ఆ రీమేక్ బాధ్యతలను దర్శకుడు వినాయక్ కు అప్పగించినట్టు టాక్ బలంగా వినిపిస్తుంది.

ఇక ఫ్లాప్ దర్శకుడు మెహర్ రమేష్ తో ‘వేదళం’ చిత్రాన్ని రీమేక్ చెయ్యాలని చిరు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో స్క్రిప్ట్ రెడీ చేసుకుని రమ్మని మెహర్ కు చెప్పారట. తన స్క్రిప్ట్ తో చిరుని సేటిస్ఫై చేస్తే ఓకే..! ఏదైనా తేడా వస్తే మాత్రం.. సుజీత్ నే తప్పించిన మెగాస్టార్ కు .. మెహర్ ను తప్పించడం పెద్ద కష్టమేమీ కాదనే చెప్పాలి…!

Most Recommended Video

ఎక్కువ రోజులు థియేటర్స్ లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్!
విడుదల కాకుండానే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఎవేవంటే..?
ఈ బుల్లితెర నటీమణుల పారితోషికాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus